Dacoit: అడివి శేష్ న్యూ అవతార్లో కనిపించబోతున్న చిత్రం ‘డెకాయిట్’ (Dacoit). ఈ చిత్రంలో శేష్ (Adivi Sesh) తొలిసారిగా మాస్ అండ్ రగ్గడ్ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తెలియజేసింది. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో పోలీస్ ఆఫీసర్గా నటించిన ఓ నటి ఫస్ట్ లుక్ని మేకర్స్ వదిలారు. ఈ నటి ఎవరంటూ సోషల్ మీడియా అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నటి మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ (Zayn Marie Khan). ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది.
Also Read- Koragajja: మరో ‘కాంతార’ తరహా చిత్రం.. ఇందులోని హైలెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు
ప్రస్తుతం ప్రతి సినీ ఇండస్ట్రీ చూపు టాలీవుడ్పై ఉన్న విషయం తెలియంది కాదు. సౌత్ పరిశ్రమ నటుల సంగతి పక్కన పెడితే, ఇప్పటికే బాలీవుడ్కు చెందిన ఎందరో నటులు టాలీవుడ్లో మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో రషా తడాని హీరోయిన్గా టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ కూడా ‘డెకాయిట్’తో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించబోతోంది. జాన్వీ కపూర్ ఆల్రెడీ టాలీవుడ్లో చేస్తున్నారు. ప్రియాంకా చోప్రా కూడా ‘వారణాసి’తో టాలీవుడ్కు పరిచయం కాబోతోంది. ఇంకా వీరి దారిలో ఎందరో బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ బాట పట్టనున్నారు. ఇప్పుడు సౌత్, నార్త్ అనే తేడాలు లేకుండా అంతా కలిసి మెలిసి సినిమాలు చేస్తూ, ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిస్తున్నారు.
Also Read- Youth Movie: ‘సఖియే..’ ఈ పాటేంటి? ఇంత బాగుంది!
ఇక జైన్ మేరీ ఖాన్ విషయానికి వస్తే.. ఆమె పుట్టినరోజు పురస్కరించుకుని ‘డెకాయిట్’ టీమ్ ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. ఈ పోస్టర్లో జైన్ పాత్ర యొక్క ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. వెనుక వైపు ఇంకా పోలీస్ అధికారులు ఉండటం ఈ సన్నివేశానికి మరింత బలం చేకూర్చింది. ఈ పోస్టర్ను చూసిన ఆమిర్ ఖాన్ (Aamir Khan) వెంటనే స్పందించి, ఆమెకు అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది.. హిందీ ప్రేక్షకుల్లో సినిమాకు మరింత హైప్ను తెచ్చినట్లయింది.ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read- SS Rajamouli: ‘ధురంధర్ 2’లో ఆ సీన్ అదిరిందన్న జక్కన్న, దర్శకుడి స్పందన చూశారా!