E-Paper
Advertisement

Dhurandhar 2 Trailer: పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్తాన్ నిర్ణయిస్తుంది.. ప్రతీకారంతో నిండిపోయిన ధురంధర్ 2 ట్రైలర్..!

Dhurandhar 2 Trailer: పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్తాన్ నిర్ణయిస్తుంది.. ప్రతీకారంతో నిండిపోయిన ధురంధర్ 2 ట్రైలర్..!

Dhurandhar 2 Trailer: బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ధురంధర్ 2. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదలై సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 7న విడుదలైన ఈ ట్రైలర్.. తెలుగు వర్షన్ ఈరోజు విడుదల చేశారు.

ఈ సినిమా 2025లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం ధురంధర్కి సీక్వెల్‌గా వస్తోంది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచిందని చెప్పాలి.

ప్రతీకారంతో నిండిపోయిన తైలర్..!

ట్రైలర్‌లో రణవీర్ సింగ్ చాలా తీవ్రమైన పవర్ ఫుల్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన హమ్జా అలీ మజారి అనే స్పై పాత్రలో కనిపిస్తారు. మొదటి భాగంలో ముందుగా ఫ్లైట్ సీన్ లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ మాధవన్ తో మాట్లాడిన మాటలతో ఈ రెండో భాగం ట్రైలర్ మొదలయింది. ఇక అందుకు ప్రతీకారంగా హీరో చేసిన పనులతో ట్రైలర్ మొత్తం నిండిపోయింది.

ట్రైలర్‌లో “హోంస్లా – ఈంధన్ – బద్లా” అనే మూడు భావనలు ప్రధానంగా చూపించారు. ధైర్యం, శక్తి.. ప్రతీకారం అనే ఈ మూడు అంశాలు కథను ముందుకు నడిపిస్తాయి అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు మరియు సస్పెన్స్ అంశాలు ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

ట్రైలర్ ప్రారంభంలోనే మొదటి భాగానికి సంబంధించిన కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. ముఖ్యంగా 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC 814 హైజాక్ ఘటనకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఆ సంఘటనలు హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో ట్రైలర్‌లో సంకేతాలుగా చూపించారు.

ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ మరియు సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా రెహ్మాన్ డకాయిత్ అనే విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రాన్ని జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ నిర్మించాయి. సంగీతాన్ని టీ-సిరీస్ అందిస్తోంది. ఈ చిత్రం మార్చి 19, 2026న ఈద్, గుడి పడ్వా మరియు ఉగాది సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ALSO READ: Telugu directors association: తెలుగు ఫిల్మ్ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య.. సాయి రాజేష్ కి కూడా కొత్త పోస్ట్..!

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×