Director Krish: అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఘాటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దర్శకుడు క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విశేషం ఏమిటంటే.. క్రిష్ రూపొందించబోయే ఈ సినిమా ట్రెక్కింగ్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ఏడు మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ అంశం వినగానే సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ట్రెక్కింగ్ నేపథ్యంలోని సినిమాలు తీయడం అంత సులువు కాదు. పర్వత ప్రాంతాలు, అరణ్యాలు, ప్రమాదకర మార్గాల్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున అవుట్డోర్ షూటింగ్, విఎఫ్ఎక్స్ వినియోగం, సహజత్వం కనిపించేలా సన్నివేశాలు తీర్చిదిద్దడం వంటి అంశాలు ఈ ప్రాజెక్ట్ను మరింత క్లిష్టంగా మార్చే అవకాశాలు లేకపోలేదు. సాంకేతికంగా బలమైన టీమ్ కూడా చాలా అవసరం ఉంటుంది.
అదే సమయంలో ఏడు మంది ప్రధాన కథానాయికలను సమతూకంగా చూపించడం కూడా పెద్ద సవాలే. ప్రతి పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరికీ అన్యాయం జరిగినట్టుగా అనిపించకూడదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో చిన్న తప్పు జరిగినా విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ లోపాలు లేదా కథనంలో బలహీనత ఉంటే ట్రోలింగ్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
అయితే.. క్రిష్ ఎప్పుడూ కొత్త కథలను ప్రయత్నించే దర్శకుడిగా గుర్తింపు పొందారు అన్న విషయం తెలిసిందే. చారిత్రక, సామాజిక, భావోద్వేగ కథలను భిన్నంగా చూపించిన అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు ఈ సాహసోపేత ప్రయోగం విజయవంతమైతే, ఆయనకు మళ్లీ టాలీవుడ్లో బలమైన స్థానం దక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రాలేదు. కానీ కథా రచన దశలో పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఏడు మంది హీరోయిన్లు ఎవరు? షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే విషయాలు త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మొత్తం పైన క్రిష్ తీసుకునే ఈ రిస్కీ నిర్ణయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అడ్వెంచర్ ప్రయాణం ఆయనకు విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి.
ALSO READ: Shriya Saran: 25 ఏళ్లుగా తీరని కోరిక.. భవిష్యత్తులోనైనా నెరవేరుతుందా?