Yash Toxic Film: కేజిఎఫ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్(Toxic) ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గీతు మోహన దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం కూడా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇలా ఈ టీజర్ వీడియో ద్వారా ఈ చిత్రం వివాదాలలో నిలిచింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని వేల చెట్లను నాశనం చేసి చిత్రీకరణ చేశారని ఆరోపణలు రావడంతో అటవీ శాఖ ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ దర్యాప్తులో భాగంగా చెట్లను నరికి వేశారని నిర్ధారణ కావడంతో చిత్ర నిర్మాతలపై అలాగే భూమిని లీజుకు ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలా ఇప్పటికే వరుస వివాదాలు ఉన్నప్పటికీ తాజాగా ఈ సినిమాపై క్రైస్తవ మతస్తుల నుంచి పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు క్రైస్తవ మతస్తులను అగౌరవపరిచేలా ఉన్నాయి అంటూ క్రైస్తవ మతస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు . ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి ఈ సన్నివేశాలపై సరైన చర్యలను తీసుకోవాలి అంటూ అధికారులకు నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ లేఖ సమర్పించారు.
క్రైస్తవ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలు క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వెంటనే ఈ సినిమా నుంచి ఈ సన్నివేశాలను తొలగించి చిత్ర బృందం వెంటనే క్రైస్తవులకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము అంటూ తెలియజేశారు. క్రైస్తవ మతస్తుల నుంచి ఈ సినిమా పట్ల ఎదురవుతున్నటువంటి ఈ అభ్యంతరాలపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు కానీ ఇది కాస్త సంచలనంగా మారింది.
ఇలా ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున వివాదాలలో నిలవడంతో అభిమానులు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా చుట్టూ ఇన్ని వివాదాలు ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికే ఈ సినిమా విడుదల అవుతుందా? లేదంటే విడుదలను అడ్డుకుంటారా? అనే విషయాలపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఏ విధంగాను స్పందించలేదు. ఇక ఈ సినిమాలో యష్ జోడీగా కియారా అద్వానీ నటించగా, తారాసుతారియా, నయనతార, రుక్మిణి వసంత్ తదితరులు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Arjun Sarja: పొలిటికల్ ఎంట్రీ పై అర్జున్ సర్జా కామెంట్స్..జ్ఞానం కూడా కావాలిగా అంటూ!