Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Harihara Veerumallu) సినిమా విడుదలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎవరది ఎవరది’ పాటను(Evaradi Evaradi Song ) విడుదల చేశారు. ‘ఎవరది ఎవరది.. అతగాడో పొడుపు కథ.. దొరకనే దొరకడు అతగాడో మెరుపు కథ’ అంటూ సాగే ఈ పాట పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అలాగే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ టీజర్, ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి.
ఆకట్టుకుంటున్న ఎవరిది.. ఎవరిది సాంగ్..
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఎవరిది ఎవరిది అనే పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం కీరవాణి (M.M.Keeravani) సంగీతం అందించారు. ఇక ఈ పాటలో అద్భుతమైన లోకేషన్లతో పాటు పవన్ కళ్యాణ్ ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక ఈ పాట ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే పీరియాడిక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlmudi) దర్శకత్వం వహించగా కొన్ని కారణాలవల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyothi Krishna)ఈ సినిమా దర్శకత్వపు బాధ్యతలు తీసుకున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు..
నిజానికి ఈ సినిమాకు గత ఎన్నికల కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యారు అయితే రాజకీయాలలో అలాగే ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా సినిమా షూటింగులను పక్కన పెట్టడం వల్ల ఆలస్యం అవుతుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏయం రత్నం(A.M.Ratnam) నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్(Nidhi Aggarwal) నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. నిజానికి ఈ సినిమా గత నెల 12వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా వేశారు.
ఇలా జూన్ 12వ తేదీ వాయిదా పడిన ఈ సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈనెల 10వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. అలాగే ఈ నెల 20 వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఏపీలో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం కూడా అభిమానులు ఎంతో ఎదురుచస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని తిరుపతి లేదా విజయవాడలో ఘనంగా ఏర్పాటు చేయాలని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
Also Read: Kaushal Manda: తమన్నా నా వల్లే హీరోయిన్ అయింది.. ఆమెకు ఆ కృతజ్ఞత లేదు