E-Paper
Advertisement

Attukal Bhagavathi Temple: 5 మిలియన్ మహిళల దేవాలయం.. ఇక్కడ మగవాళ్లకి నో ఎంట్రీ!

Attukal Bhagavathi Temple: 5 మిలియన్ మహిళల దేవాలయం.. ఇక్కడ మగవాళ్లకి నో ఎంట్రీ!

Attukal Bhagavathi Temple: ఏదైనా ఊరులోని దేవాలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడడం సర్వసాధారణం. కానీ ఓ ప్రత్యేకమైన దేవాలయం మాత్రం ఏటా ఒక్కరోజు మాత్రమే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఊరంతా దేవాలయంలా మారిపోతుంది. మగవాళ్లకు అక్కడ ప్రవేశమే ఉండదు.

వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో కాదు.. ఏకంగా 5 మిలియన్లకు పైగా మహిళలు ఒక్కటై ఒకే దేవతకి నైవేద్యం సమర్పిస్తారు. ఇది ఓ ఉత్సవం కాదు.. ఇది మహిళా శక్తికి అంకితమైన ఆధ్యాత్మిక ఉద్యమం. దీన్ని చూసినవారు ఆశ్చర్యంతో అలా ఉండిపోవాల్సిందే. ఈ ఆలయం ఎక్కడో ఉందని అనుకోవద్దు.. కేరళలో గల అట్టుకల్ భగవతి ఆలయమే ఇది.

ఈ ఆలయం ప్రత్యేకత ఇదే!
ఈ ఆలయంలో అమ్మవారు భద్రకాళి రూపంలో కొలువై ఉంటారు. కానీ భయపెట్టే శక్తిగా కాదు, రక్షించే శక్తిగా భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అమ్మవారి గర్భగుడికి వచ్చే మార్గం మొదలుకుని ఆలయ ఆవరణలో జరిగే ప్రతీదీ ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది. అమ్మవారి సేవలో పాల్గొనేది, పూజలు నిర్వహించేది, నైవేద్యం సమర్పించేది కూడా అందరూ మహిళలే కావడం విశేషం.

ఇక్కడ లింగ సమానత్వంపై పోరాటం ఉండదు. ఎందుకంటే ఇక్కడ భగవతి అమ్మవారు కూడా మహిళే.. ఆమె భక్తులూ మహిళలే.. ఆమె కోసం జరుగుతున్న ఉత్సవాలన్నీ మహిళలే నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రతి సంవత్సరం పొంగాల పండుగకు వేదికగా మారుతుంది.

ఈ పండగ స్పెషాలిటీ ఏమిటి?
పొంగాల అనేది ఒక పవిత్ర నైవేద్యం. ఇది బెల్లం, అక్కర, కొబ్బరి, నెయ్యితో తయారుచేసే తీపి వంటకం. కానీ ఇది కేవలం తిండిగా కాకుండా, అమ్మవారికి అంకితంగా చేసే అర్చనగా భావిస్తారు. ఈ నైవేద్యాన్ని మట్టిపాత్రల్లో.. రహదారుల మీద, వరుసగా కూర్చుని వండతారు. పొంగాల వండే స్థలంను ఆలయ సమీపంలో ఎంచుకుంటారు. మహిళలు వందల కిలోమీటర్ల దూరాల నుండి వయసు తారతమ్యమేమీ లేకుండా వస్తారు.

చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు.. అందరూ పొంగాల వంటలో పాల్గొంటారు. మట్టిమడకలలో మంటల మీద వేడి చేసుకుంటూ వండే ఆ ఘట్టం.. అది చూస్తే కళ్లలో నీళ్లు వచ్చేంత పవిత్రంగా ఉంటుంది. పొంగాల వండే మహిళలు ఎవరికీ చెప్పరు, ఇది నా చోటని. ఎందుకంటే అక్కడ ఆ ఒక్కరోజు అందరూ సమానమే.

ఈ రోజు ఊరు మొత్తం ఒక ఆలయం అవుతుంది. ట్రాఫిక్ నిలిపివేస్తారు. స్కూళ్లు, దుకాణాలు మూసేస్తారు. ఎందుకంటే ఈ వంట, ఈ పూజ ఒక అమ్మవారి ఆజ్ఞతో జరుగుతుంది. పొగలు గాలి నుంచి ఆకాశానికెక్కుతుంటాయి. మట్టిమడకల మంటలు ఇళ్ల ముందూ, గల్లీల్లోనూ, వీధుల్లోనూ వెలిగిపోతుంటాయి. ఒక పక్క అమ్మవారికి హారతులు, మరో పక్క పొంగాల చిమ్ని గుగ్గిళ్ళు.. ఈ మేళవింపు చూసే దృష్టికి అది ప్రపంచంలో ఏ పవిత్ర ఘట్టానికీ తీసిపోదు. మహిళలు కలసి శక్తిగా మారే వేళ అది.

పురుషులకు నో ఎంట్రీ!
ఈ ఉత్సవానికి సంబంధించిన మరో విశేషం.. పురుషులకు ప్రవేశం లేదు. ఇది మనం ఊహించుకునే నిషేధం కాదు. ఇది ఒక ఆచారాన్ని గౌరవించే ఆమోదం. దీని వెనక ఉన్న ఉద్దేశం.. అమ్మవారికి పూజ చేసే హక్కు మహిళలకే ఇవ్వాలి, ఎందుకంటే అమ్మవారే శక్తి, ఆ శక్తికి ప్రతిరూపమే మహిళలు. ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. అమ్మవారిని అలరించాలంటే ఆడవాళ్లే ముందుండాలన్న నమ్మకంతోనే ఈ విధానం. ఇది మహిళను నిలబెట్టే, ఆమెకు విశేష స్థానం కల్పించే మహోన్నత ఆచారం.

Also Read: Amrit Bharat express trains: తెలుగు రాష్ట్రాలలోని.. కొత్త రూట్లలో అమృత్ భారత్ ట్రైన్స్.. ఇక నో వెయిటింగ్!

గిన్నీస్ లో చోటు..
2009లో ఈ ఉత్సవం గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. అప్పట్లో 30 లక్షల మంది పాల్గొనగా, ప్రస్తుతం 5 మిలియన్లను దాటింది. ప్రపంచంలో మహిళలు కలిసికట్టుగా ఒకే సమయానికి ఇలా ఆధ్యాత్మికంగా ఏకం కావడం ఇదే మొదటిసారి. ఈ ఉత్సవాన్ని ప్రత్యేకంగా చూడటానికి దేశవిదేశాల నుండి పర్యాటకులు కూడా వస్తుంటారు. మీడియా, జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు.. అందరికీ ఇది అద్భుతం. ఎందుకంటే ఇది ఒక పండుగ కాదు, ఒక మహిళా ఉద్యమం, ఆధ్యాత్మిక జయప్రదానం.

పొంగాల రోజు ఊరిలో అందరూ మహిళలే కారు, వాలంటీర్లు, పోలీస్ స్టాఫ్, హెల్త్ వర్కర్లు.. వీరిలో అత్యధికంగా మహిళలే ఉంటారు. ఎందుకంటే మహిళల కోసం మహిళలే ముందుండాలనే ఆలోచనతోనే ఈ ఏర్పాట్లు జరుగుతాయి. ఇది మహిళలకు ఇచ్చే గౌరవం, తమకున్న శక్తిని గుర్తించే సందర్భం. అట్టుకల్ భగవతి ఆలయం.. మహిళ అంటే భక్తి, శక్తి, త్యాగం, తల్లి ప్రేమగా చాటిచెబుతుంది.

ఇక్కడ దేవత ఆడవారు. పూజించేవాళ్లు కూడా ఆడవాళ్లు. సేవ చేసే వృత్తి మహిళలే. అర్చకురాళ్లు మాత్రమే కాకుండా.. సేవకురాళ్లు, వాలంటీర్లు, భక్తురాళ్లు అన్నీ అమ్మవారే. ఇక్కడ మగవాళ్లకు ఆమోదం లేదనే భావన లేదు. కానీ ఈ ఆచారం, ఈ సంప్రదాయం, అమ్మవారితో ఉన్న అనుబంధానికి ప్రత్యేకత. ఇది వేరేలా అర్థం చేసుకోవడం కాదు.. ఇది ఒక అంగీకారంగా భక్తులు అభివర్ణిస్తారు.

ప్రపంచం లింగ సమానత్వంపై చర్చిస్తుంటే, ఇక్కడ అది ఆచరణలో ఉంది. ఇక్కడ సమానత్వం కాదు.. మహిళా ప్రాముఖ్యత ఉంది. సమాజంలో మహిళలకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వాలంటే చట్టాలు, ఉద్యమాలు అవసరం ఉండకపోవచ్చు.. కానీ ఇలా ఒక పవిత్ర దృశ్యం మాత్రం మార్గదర్శకం అవుతుంది.

ఈ ఆలయాన్ని ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడాల్సిందే. ఎందుకంటే అది కేవలం ఒక దేవాలయం కాదు.. అది ఒక మహిళా శక్తి స్మారక చిహ్నం. అది ఒక మట్టిపాత్రలో పుట్టే పవిత్రత. అది ఒక గొప్ప తల్లి చేతిలో వెలసే తేజస్సు. అందుకే మరెందుకు ఆలస్యం.. ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×