E-Paper
Advertisement

Hombale films: ప్రభాస్ కోసం హోంబలే ఫిల్మ్స్ కొత్త ప్రయోగం.. ఫలించేనా?

Hombale films: ప్రభాస్ కోసం హోంబలే ఫిల్మ్స్ కొత్త ప్రయోగం.. ఫలించేనా?
Advertisement

Hombale films:కేజీఎఫ్ 1&2 చిత్రాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీళ్(Prashanth neel) ప్రభాస్ తో ‘సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్ ‘ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రభాస్ – శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా తర్వాత ‘సలార్ పార్ట్ 2 : శౌర్యంగ పర్వం’ ఉంటుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అటు ప్రభాస్ తన వరుస సినిమాలతో బిజీగా ఉండడం ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ కూడా ఇతర స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో సలార్ పార్ట్ 2 ఉండదు అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి.

ప్రభాస్ కోసం హోంబలే ఫిలిమ్స్ కొత్త నిర్ణయం..

అయితే అభిమానులు మాత్రం సలార్ పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సడన్గా హోం బలే ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం అభిమానులకు మింగుడు పడడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆడియన్స్ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని హోంబలే ఫిలిమ్స్ సరికొత్త ఆలోచనలు చేస్తోందట. అందులో భాగంగానే ప్రభాస్ తో సలార్ 2 చిత్రం కాకుండా మరో కొత్త సినిమా చేయడానికి కొత్త కథలు, దర్శకులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్స్ అటు హోంబలే నిర్మిస్తున్న చిత్రాలు అన్ని పూర్తయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సలార్ 2 లేనట్టేనా?

Advertisement

ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సలార్ 2 లేనట్టే అని చెప్పవచ్చు.. ఏదిఏమైనా హోం బలే ఫిలిమ్స్ తీసుకున్న నిర్ణయం సలార్ అభిమానులకు తీరని నిరాశ మిగిలిస్తోందని చెప్పాలి . ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. మరి దీనిపై నిర్మాణ సంస్థ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

ALSO READ:Nora Fatehi: నోరాఫతేహి ఇంట్లో విషాదం.. నా ప్రయాణంలో ప్రతి అడుగు నీవేనంటూ ఎమోషనల్ పోస్ట్!

ప్రభాస్ తదుపరి సినిమాలు..

Advertisement

ప్రభాస్ విషయానికి వస్తే.. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఈ ఏడాది ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన కెరీర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో చేసిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ముఖ్యంగా మారుతి ప్రభాస్ ను సరిగా వాడుకోలేదు అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అర్జున్ రెడ్డి , యానిమల్ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారిక డేట్ కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రభాస్ హోం బలే కొత్త ప్రాజెక్టులో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు అధికారికం కానున్నట్లు సమాచారం.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×