IBomma: సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పైరసీ (Piracy)జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లలోకి వచ్చిందే ఆలస్యం వెంటనే పలు వెబ్ సైట్ లలో హెచ్డీ ప్రింట్ అందుబాటులోకి వస్తుంది తద్వారా సినిమా నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు ఏర్పడటమే కాకుండా ప్రభుత్వాలకు కూడా భారీ స్థాయిలో నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఈ పైరసీ ముఠాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్(Cyber Crime) దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇండియాలోనే అతిపెద్ద పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలా పైరసీ ద్వారా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వేలకోట్ల రూపాయల నష్టం చేకూరిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(C.V Anand) తో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో భాగంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున పైరసీ ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐ బొమ్మ(IBomma) హెడ్ పట్టుకుంటామని, ఇప్పటికే దీనికి సంబంధించి నలుగురును అదుపులోకి తీసుకున్నాము అంటూ ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మకు తమదైన శైలిలోనే మార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఐ బొమ్మ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని వెల్లడించారు.
ఇక ఈ విషయంలో భాగంగా పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీస్ ఆనంద్ గారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ఈయన అధికారికంగా సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీల కంపెనీ ప్రతినిధులను సినిమా పైరసీ గ్యాంగుల అరెస్టు చేసిన విషయం మరియు పైరసీ జరుగుతున్న తీరును వివరించడానికి వీరందరిని ఒక సమావేశానికి ఆహ్వానించి ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలను తెలియజేశాము.
'ఐబొమ్మ' నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాం.. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి, అధునాతన పరికరాలు వాడి అతి పెద్ద పైరసీ ముఠాను పట్టుకున్నాం.. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం
– సీవీ ఆనంద్ https://t.co/IngMLYXtNf pic.twitter.com/1wNjpq4n3s
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025
ఒక సినిమా థియేటర్లో విడుదలకు ముందే హెచ్డి ప్రింట్ ఎలా బయటకు వస్తోందనే విషయాన్ని తెలుసుకొని వారందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు. భవిష్యత్తులో వారందరూ ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ పైరసీ అనేది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులే హ్యాకర్లకు, ఫైటర్లకు డబ్బులు చెల్లిస్తున్నారనే విషయం సినిమా సెలబ్రిటీలకు ఇప్పటివరకు తెలియదని ఆనంద్ పేర్కొన్నారు. డిజిటల్ మీడియా కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ ఎంత తక్కువగా ఉందో గ్రహించి సర్వర్ల రక్షణ కోసం మరింత వ్యయం ఖర్చు చేస్తాయని హామీ ఇచ్చారు. ఇక ఈ భేటీలో భాగంగా వెంకటేష్ నాగార్జున, చిరంజీవి, దిల్ రాజు, నాని, రామ్ పోతినేని వంటి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా పైరసీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా ప్రత్యేకంగా ఐబొమ్మపై దృష్టి సారిస్తామనే విషయాన్ని తెలియజేయడంతో త్వరలోనే ఐ బొమ్మకు కూడా భారీగా మూడినట్టు ఉందని స్పష్టం అవుతుంది.