E-Paper
Advertisement

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!
Advertisement

SSMB 29: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి (Rajamouli ). ‘శాంతి నివాసం’ అనే సీరియల్ ఎపిసోడ్ ద్వారా డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈయన.. ఆ తర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్, విక్రమార్కుడు, సై, మగధీర ఇలా పలు చిత్రాలు చేసి ఓట మెరుగని దర్శకుడిగా పేరు దక్కించుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకొని.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్గా పేరు అందుకున్నారు. ఇప్పుడు రాజమౌళి – మహేష్ బాబు (Mahesh Babu) తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబి – 29’ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

శరవేగంగా జరుగుతున్న షూటింగ్..

షూటింగ్ అయితే జరుగుతోంది కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు వెలువడలేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన మెడలో ఉండే లాకెట్ ను హైలెట్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి. అప్పటినుంచి మరో అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఈ ఏడాది నవంబర్లో అతిపెద్ద అప్డేట్ తో మీ ముందుకు వస్తానని రాజమౌళి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా వేగంగా కంప్లీట్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

Advertisement

టార్గెట్ ఫిక్స్ చేసిన రాజమౌళి..

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాకి జక్కన్న టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో 2027 మార్చి 25వ తేదీన రిలీజ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారట. దీంతో విడుదల తేదీకి కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా పూర్తి చేయాలని రాజమౌళి అనుకుంటూ ఉండగా అటు మహేష్ బాబు మాత్రం అయోమయంలో పడినట్లు తెలుస్తోంది.

Advertisement

అయోమయంలో మహేష్ బాబు..

సాధారణంగా మహేష్ బాబు కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఈయనకు ఇప్పుడు రాజమౌళి ఇంత పెద్ద టార్గెట్ ఫిక్స్ చేయడంతో మహేష్ బాబు కాస్త అయోమయంలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి మాత్రం ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తూ.. ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

SSMB29 మూవీ విశేషాలు..

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది.. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు 70% పూర్తీ అయినట్లు సమాచారం. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోందని.. ఏకంగా రూ.1200 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.

ALSO READ:Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×