హైదరాబాద్, డిసెంబర్ 2025: నగరంలోని మాదాపూర్, హైటెక్ సిటీ ప్రధాన రోడ్డు వైపు ఉన్న మెట్రో పిల్లర్ నంబర్ 1743 వద్ద అసియాలోనే ప్రథమ థియేట్రికల్ డైనింగ్ స్పేస్ “హియ్యా క్రోనో జైలు మండిని” బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ అతిథులకు జైలు నేపథ్య వాతావరణంలో ప్రత్యేకమైన డైనింగ్ అనుభవం అందిస్తుంది.
ఈ సందర్భంగా, సన్నీ లియోన్ హియ్యాలోని రుచికరమైన వంటకాలను, అలాగే నగరంలోని వైవిధ్యభరిత రుచులను ప్రశంసిస్తూ, ‘‘హియ్యా లోని ఆహారం మరియు థీమ్ నిజంగా చాలా ఆకట్టుకుంది. నేను ఇప్పటివరకు రుచిచూసిన అత్యంత రుచికరమైన మండి వంటకాలు ఇవే. నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం, వీలైనప్పుడల్లా హైదరాబాద్కి రావడానికి ఇష్టపడతాను’’ అని చెప్పారు.
హియ్యా రెస్టారెంట్ యొక్క నిర్వాహకురాలు గౌతమి చౌదరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “మా హియ్యా జైలు మండీ మధ్యతరగతికి ఉత్తమ నేపథ్య అనుభవాన్ని అందిస్తుందని, ఇది నగరంలో అత్యంత ఆసక్తికరమైన, ఇన్స్టాగ్రామ్కు అనువైన స్పాట్గా మారుతుందని మేము నమ్ముతాము. మా బ్రాండ్ ఫ్రాంచైజీలను కూడా అందిస్తున్నాం, ఆసక్తి ఉన్న వారు వివరాలు తెలుసుకోడానికి మమ్మల్ని సంప్రదించవచ్చు” అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సన్నీ లియోన్ను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆమె అభిమానులతో హృదయపూర్వకంగా పలకరిస్తూ, వారి మధ్య ఉత్సాహం మరింత పెరిగింది.