E-Paper
Advertisement

Jana Nayagan: హైకోర్టు తీర్పు ఇచ్చినా.. మళ్లీ చిక్కుల్లో జన నాయగన్‌

Jana Nayagan: హైకోర్టు తీర్పు ఇచ్చినా.. మళ్లీ చిక్కుల్లో జన నాయగన్‌
Advertisement

Jana Nayagan:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) ఆఖరి సినిమాగా రాబోతున్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). తెలుగులో జన నాయకుడు , హిందీలో జననేత అనే టైటిల్స్ తో డబ్బింగ్ వె ర్షన్లలో ఈ సినిమాను జనవరి 9న అంటే ఈరోజు విడుదల చేయాల్సి ఉంది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కారణంగానే విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలోని జననాయగన్ సినిమా నిర్మాతలు సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. అయితే విచారణ నిర్వహించిన మద్రాస్ హైకోర్టు జన నాయగన్ చిత్రానికి భారీ ఊరట కలిగించింది.

జన నాయగన్ చిత్రానికి హైకోర్టు భారీ ఊరట..

ముందుగా సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత రివ్యూకు ఎందుకు పంపించారు అని సెన్సార్ ను ప్రశ్నించింది హైకోర్టు. ఇక ముందుగా ఇచ్చిన యూ/ఏ సర్టిఫికెట్ ని మళ్ళీ జన నాయగన్ మూవీకి ఇవ్వాలి అని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో ఈ సినిమాకు సెన్సార్ లభించిందని, విడుదలకు సిద్ధమవుతుందని అభిమానులే కాదు చిత్ర బృందం కూడా అనుకునేలోపే ఇప్పుడు మరోసారి జన నాయగన్ కు షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.

హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సెన్సార్ బోర్డు..

Advertisement

అయితే హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సెన్సార్ బోర్డు నిర్వహకులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ షాక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో.. ఆ తీర్పుని సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలంటూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. ఈరోజు మధ్యాహ్నం 2: 15 గంటలకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఏది ఏమైనా జన నాయగన్ సినిమాకి వరుస సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

విడుదల తేదీ కూడా ఆలస్యమేనా..

అన్నీ సెట్ అయితే కొత్త రిలీజ్ డేట్ జనవరి 23 అని అనుకుంటున్నారు. మరి ఈ టైం లో మళ్ళీ అప్లికేషన్ కి వెళ్తే అక్కడ రిలీజ్ డేట్ కి కూడా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి.జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దళపతి ఆఖరి సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాబి డియోల్, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ , ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2023లో బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రాబోతోంది. వాస్తవానికి డైరెక్టర్ ఈ సినిమా రీమేక్ కాదని ఇటీవల మలేషియాలో జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో స్పష్టం చేసినా.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మాత్రం 90% భగవంత్ కేసరికి రీమేక్ అని స్పష్టం చేసింది.

Advertisement

also read:The RajaSaab: 23 కోట్ల ఫైట్ సీన్.. మొసళ్ల సీన్ వర్కౌట్ అయ్యిందా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×