E-Paper
Advertisement

Janhvi Kapoor: దివ్వెల మాధురి వ్యాఖ్యలపై జాన్వీ కపూర్ సీరియస్.. అసలు ఆమె ఎవరు..

Janhvi Kapoor: దివ్వెల మాధురి వ్యాఖ్యలపై జాన్వీ కపూర్ సీరియస్.. అసలు ఆమె ఎవరు..

Janhvi Kapoor: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాధురి దివ్వెల చేసిన వ్యాఖ్యలు, దానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇచ్చిన కౌంటర్ టాలీవుడ్ మరియు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. పవిత్రతను కాపాడాల్సిన చోట నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, ఇతరులపై ఆరోపణలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read also-Raashi Khanna: పవన్ కళ్యాణ్ నుంచి రాశి ఖన్నా నేర్చుకున్నది ఇదే.. కల నిజమైన వేళ..

అసలు ఏం జరిగింది?

ఇటీవల మాధురి దివ్వెల తిరుమల కొండపై తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ కేక్ కట్ చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల సన్నిధిలో ఇలా కేక్ కట్ చేయడం, అపవిత్రం చేయడంపై భక్తులు మరియు టీటీడీ (TTD) వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ వివాదంపై స్పందించిన మాధురి దివ్వెల, బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తప్పును ఒప్పుకోవడానికి బదులు, ఇతరులను ఈ వివాదంలోకి లాగారు. “తిరుమల కొండపై గతంలో నటి జాన్వీ కపూర్ కూడా కేక్ కట్ చేశారు. అప్పుడు ఎవరూ స్పందించలేదు, కానీ నేను చేస్తే మాత్రం ఇంత సంచలనం చేస్తున్నారెందుకు?” అంటూ ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించే క్రమంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు.

Read also-Ustad Bhagat Singh Event: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో జగన్‌పై పంచులేసిన వపన్ ఫ్యాన్స్.. బాబోయ్ ఎందిగురూ..

జాన్వీ కపూర్ ఘాటు స్పందన

మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు జాన్వీ కపూర్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే జాన్వీ, ఈసారి మాత్రం గట్టిగానే స్పందించారు. మాధురి ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ, “అసలు ఎవరు ఈ మహిళ?” అంటూ సూటిగా ప్రశ్నించారు. జాన్వీ తన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, తనపై వచ్చిన వివాదాన్ని మళ్లించడానికి నాపై అబద్ధపు ఆరోపణలు చేస్తోంది” అని మండిపడ్డారు. జాన్వీ కపూర్‌కు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే ఎంతటి అపారమైన భక్తో అందరికీ తెలిసిందే. తరచుగా ఆమె కాలినడకన కొండెక్కి స్వామివారిని దర్శించుకుంటారు. “తిరుమల వేంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దు. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు” అంటూ మాధురిని హెచ్చరించారు. తిరుమల వంటి పవిత్ర ప్రదేశాల్లో నిబంధనలు పాటించడం సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా ఒకేలా ఉండాలి. తన తప్పును సమర్థించుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జాన్వీ కపూర్ స్పందనతో ఈ వివాదం మరింత ముదిరింది. చట్టపరంగా లేదా టీటీడీ పరంగా మాధురిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×