Jayam movie: వెండితెరపై కొందరు బాలనటులు తమ అమాయకపు నటనతో, క్యూట్ హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంటారు. కాలం గడిచినా వారి పాత్రలు మాత్రం అలాగే గుర్తుండిపోతాయి. ‘జయం’ సినిమాలో అక్షరాలు తిరగరాస్తూ, తనదైన మేనరిజంతో అలరించిన ఆ చిన్నారి గుర్తుందిగా? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.
ఒకే ఒక్క సినిమా..
తేజ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ ‘జయం’లో హీరోయిన్ సదా చెల్లిగా నటించిన యామిని శ్వేత నాయుడు అప్పట్లో పెద్ద సెన్సేషన్. సీనియర్ నటి జయలక్ష్మి కుమార్తె అయిన యామిని, అంతకుముందే పలు సీరియల్స్లో నటించి మెప్పించింది. అయితే ‘జయం’ సినిమాలో అక్షరాలు తిరగరాసే అలవాటున్న అమ్మాయిగా ఆమె చేసిన అల్లరి, క్యూట్ నటనకు ఏకంగా నంది అవార్డు వరించింది.
హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నా..
‘జయం’ తర్వాత యామిని శ్వేతకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడే హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చాయట. కానీ, గ్లామర్ ప్రపంచం కంటే చదువే ముఖ్యమని భావించిన యామిని, సినిమాలకు స్వస్తి పలికింది. డిగ్రీ పూర్తి చేసి, తన భవిష్యత్తును వెతుక్కుంది.
అమెరికాలో సెటిల్..
చదువు ముగించిన యామిని, పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు సంతానం. మొదటి సంతానంగా ఓ పాపకు జన్మనిచ్చింది యామిని శ్వేత. 2025లో తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అక్కగా నటించిన సదా మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా జీవిస్తుండగా, చెల్లులుగా నటించిన యామిని శ్వేత మాత్రం ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది. యామిని శ్వేత తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. జీవితంలోని ఈ అందమైన దశను ఎంజాయ్ చేస్తోంది.
సినిమాలకు దూరమైనా..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ బయోలో జయం ఫేమ్, నంది అవార్డ్ విన్నర్ అని గర్వంగా రాసుకున్న యామినిని చూసి నెటిజన్లు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.