Jr NTR:తాజాగా విడుదలైన ధురంధర్: ది రివెంజ్ సినిమా మంచి విజయం సాధించింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి చర్చకు దారితీసింది. ముఖ్యంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఈ సినిమాపై స్పందించడం ఆసక్తికరంగా మారింది.
మొదటగా అల్లు అర్జున్ ఈ సినిమాను ప్రశంసించారు. ఆయన చెప్పిన మంచి మాటలకు సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన మాధవన్ వెంటనే స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ నుంచి ప్రశంసలు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని మాధవన్ పేర్కొన్నారు.
అదే విధంగా మహేష్ బాబు కూడా ఈ సినిమాపై స్పందించారు. ఆయన ఈ చిత్రాన్ని “పర్ఫెక్ట్ ప్రిసిషన్తో చేసిన ఎక్స్ప్లోజన్” అని అభివర్ణించారు. మహేష్ బాబు కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కూడా మాధవన్ స్పందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా మాధవన్ నటనపై ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినిమాలో ప్రతి సీన్లో మాధవన్ అద్భుతంగా నటించారని, ఆయన నటన ఈ సినిమాకు హైలైట్ అని అన్నారు.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అల్లు అర్జున్, మహేష్ బాబు ట్వీట్లకు వెంటనే స్పందించిన మాధవన్, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్కు మాత్రం స్పందించలేదు. ఇది అభిమానుల్లో చర్చకు దారితీసింది.
కొంతమంది ఫ్యాన్స్ ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం టైమింగ్ సమస్య కావచ్చని, మాధవన్ ఆ ట్వీట్ చూడకపోయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కొద్దిగా నిరాశకు అలానే ఆగ్రహానికి గురిచేస్తుంది.
ALSO READ: Mrunal Thakur: సిగ్గు లేకుండా. అవకాశాలు అడిగాను.. కెరీర్ కష్టాలను బయట పెట్టిన మృణాల్!