E-Paper
Advertisement

Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Kamakshi Bhaskarla: నిరాశగా అనిపిస్తే చాలు.. శవాల మధ్యలో కూర్చుంటా.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

Kamakshi Bhaskarla: కొంతమంది హీరోయిన్లు సినిమాలతోనే కాకుండా తమ సోషల్ మీడియా వీడియోల ద్వారా కూడా తెగ ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు.. కామాక్షి భాస్కర్ల. చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరోపక్క ఆమె సోషల్ మీడియాలో చేసే కొన్ని వీడియోలు అలానే ఆమె చెప్పే కొన్ని మాటలు ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆకట్టుకుంటూ ఉంటాయి.

కామాక్షి భాస్కర్ల అసలు వృత్తి డాక్టర్. ఆమె చైనాలో ఎంబీబీఎస్ చదివింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసింది. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండటంతో తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆమె 2019లో విడుదలైన ప్రియురాలు అనే సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు చేసింది. కానీ ఆమెకు అసలు గుర్తింపు తెచ్చింది మా ఊరి పొలిమేర సినిమా. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. తర్వాత వచ్చిన పొలిమేర 2 సినిమాలో కూడా ఆమె లక్ష్మీ పాత్రలో నటించి మరింత పేరు సంపాదించింది.

ఈ సినిమాలో చేసిన నటనకు గాను కామాక్షి భాస్కర్లకు 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. దీంతో ఆమె పేరు మరింతగా వినిపించింది.

ఇటీవల కామాక్షి నటించిన “12A రైల్వే కాలనీ” అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చేసింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అక్కడికే వెళ్తా..!

తనకు చాలా ఒత్తిడి లేదా నిరాశగా అనిపించినప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేస్తానని ఆమె తెలిపింది. మనసుకు ప్రశాంతత కావాలనిపించినప్పుడు తాను స్మశానానికి వెళ్తానని చెప్పింది. అక్కడికి వెళ్లినప్పుడు జీవితం గురించి చాలా విషయాలు గుర్తుకు వస్తాయని ఆమె చెప్పింది.

స్మశానంలో కొంతసేపు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మనసుకు ఒక రకమైన శాంతి లభిస్తుందని కామాక్షి తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత తనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు.. అనిపిస్తుందని కూడా చెప్పింది.కానీ అలా శవాల మధ్యలో కూర్చుంటే తనకు మనశాంతి వస్తుంది అని ఈ హీరోయిన్ అనధం అందరిని ఆశ్చర్యపరిస్తోంది.

కామాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ఆలోచనను ఆసక్తికరంగా చూస్తుండగా, మరికొందరు ఆశ్చర్యంగా భావిస్తున్నారు.

ALSO READ: Rajendra Prasad: వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్…తమిళంలో సారీ చెప్పిన నటుడు..!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×