E-Paper
Advertisement

Kishore Tirumala: కిషోర్ డ్రీం ప్రాజెక్టు కోసం రంగంలోకి స్టార్ హీరో.. త్రివిక్రమ్ కి పోటీ ఇస్తున్నారా?

Kishore Tirumala: కిషోర్ డ్రీం ప్రాజెక్టు కోసం రంగంలోకి స్టార్ హీరో.. త్రివిక్రమ్ కి పోటీ ఇస్తున్నారా?

Kishore Tirumala:ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఎప్పుడైతే మైథలాజికల్ కాన్సెప్ట్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆధారంగా చేసుకుని సినిమా చేయబోతున్నారు అని వార్తలు వినిపించాయో.. అప్పటినుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ కాన్సెప్ట్ తో స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిని ఆయన ఎలా చిత్రీకరించబోతున్నారు అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ డైరెక్టర్ కిషోర్ తిరుమల (Kishore Tirumala) తన డ్రీం ప్రాజెక్టు గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

డ్రీమ్ ప్రాజెక్టును బయటపెట్టిన కిషోర్ తిరుమల..

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజ (Raviteja) తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా తీశారు కిషోర్ తిరుమల. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా విశేషాలతోపాటు తన కెరియర్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన డ్రీం ప్రాజెక్టు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ..” మైథలాజికల్ కాన్సెప్ట్ లో ‘గౌరీ తనయ’ అనే టైటిల్ తో నాలుగు సంవత్సరాల క్రితమే సుబ్రహ్మణ్యస్వామిని బేస్ చేసుకుని నేను ఒక సినిమా కథను రాసుకున్నాను. అయితే ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న చిత్రం. అటు బడా నిర్మాతలతో పాటు స్టార్ కాస్ట్ కూడా ఉండాలి. స్టార్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమా కోసం పనిచేయాలి. వారందరూ దొరికితే నేను అనుకున్న గౌరీ తనయ ప్రాజెక్టు తెరపైకి వస్తుంది” అని తన కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే.

గౌరీ తనయా కోసం స్టార్ హీరో..

అయితే ఇప్పుడు తాజాగా కిషోర్ తిరుమల డ్రీమ్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి..అసలు విషయంలోకి వెళ్తే నాచురల్ స్టార్ నాని(Nani )తన తదుపరి చిత్రం కోసం కిషోర్ తిరుమల దర్శకత్వంలో పౌరాణిక ఫాంటసీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌరీ తనయ అనే టైటిల్ తో ఈ చిత్రం గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి కథను సమకాలిన అంశాలతో మేళవించి తెరకెక్కనుంది.

త్రివిక్రమ్ కి పోటీ ఇవ్వనున్నారా?

ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు త్రివిక్రమ్ కూడా ఇదే కాన్సెప్ట్ లో ఏకంగా అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారు. కొంపతీసి కిషోర్ తిరుమల ఏకంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు పోటీగా వెళ్లనున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ రెండు ప్రాజెక్టులు కూడా కార్తికేయుడు కథను బేస్ చేసుకుని తెరపైకి వస్తే ఏ చిత్రం ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

నాని తదుపరి చిత్రాలు..

నాని విషయానికి వస్తే ప్రస్తుతం ది ప్యారడైజ్, బ్లడీ రోమియో వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అటు డైరెక్టర్ కే కాదు ఇటు హీరోకి కూడా ఇది వినూత్న ప్రయోగం అనే చెప్పాలి. మరి ఈ వినూత్న ప్రయోగం ఫలిస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Jana Nayagan: జన నాయగన్ రీమేక్ కాదు.. ఇదెక్కడి లాజిక్?

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×