Madhu Nandan Shambala Experience: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు మధు నందన్. హీరోలకు స్నేహితుడిగా.. సహాయ నటుడిగా..కమెడియన్గా కనిపిస్తూ తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుండె జారి గల్లంతయ్యిందే, ఇష్క్, అలా మొదలైంది వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తక్కువ సమయంలోనే పాపులర్ అయిన మధునందన్..ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా కనిపించారు. కానీ ఈ మధ్య మాత్రం పెద్దగా సినిమాల్లో కనిపియ్యలేదు.
ఇక చాలా రోజుల తర్వాత..ఇటీవల మధునందన్ శంబాల నిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. చాలా రోజుల తర్వాత ఆయనకు ముఖ్యమైన పాత్ర దక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మధునందన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన అనుభవం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
శంబాల సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో ఓ హోటల్లో ఉంటున్నప్పుడు తనకు ఒక అనుకొని సంఘటన ఎదురైందని మధునందన్ తెలిపారు. ఒక రోజు స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు బాత్రూం అద్దం మొత్తం ఆవిరితో నిండిపోతుంది కాబట్టి అక్కడ ఏమి చూసుకోకుండా బయటకి వచ్చి అద్దంలో చూసుకుంటే తన ఛాతీ ముందు భాగంలో మూడు ఎర్రని గీతలు కనిపించాయని చెప్పారు. మొదట అవి సబ్బుతో గీసుకున్న గీతలేమో అనుకున్నారట. కానీ వెనక భాగంలో కూడా అదే విధంగా నొప్పి ఉండటంతో.. అక్కడ చూసుకుంటే అక్కడ కూడా మార్కులు కనిపించాయన్నారు.
అంతే కాదు.. తాను స్నానం తర్వాత తల తుడవడానికి టవల్ను సూట్కేస్ మీద పెట్టానని..అది తనకు స్పష్టంగా గుర్తుందని చెప్పారు. కొద్దిసేపటికి ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేసరికి ఆ టవల్ కుర్చీ మీద ఉండటాన్ని గమనించారట. అప్పుడే అక్కడ ఏదో తెలియని ఇది ఉందేమో అనే అనుమానం తనకు కలిగిందని .. అది 100 పర్సెంట్ నిజమై ఉంటుందని..మధునందన్ చెప్పారు. ఆ సంఘటన తనను చాలా రోజుల పాటు భయపెట్టిందని కూడా వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నమ్మగా..మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా..మధునందన్ చెప్పిన ఈ అనుభవం అందరినీ షాక్ కి గురి చేసింది.
ALSO READ: Rakul Preeth Singh : స్కిన్ ఫిట్ డ్రెస్ లో మెంటలెక్కిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్…