Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కడ కనిపించినా అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తారు. ఆయన స్టైల్, సింప్లిసిటీ చాలా మందికి ఎంతో ఇష్టం. తాజాగా మహేష్ బాబు పాల్గొన్న ఒక ప్రైవేట్ బర్త్డే వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని నెలల క్రితం ఘట్టమనేని సాయి రాఘవ పిల్లల బర్త్డే వేడుక జరిగింది. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా సింపుల్గా జరిగింది. ఆ వేడుకకు మహేష్ బాబు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను తాజాగా సాయి రాఘవ భార్య ప్రియాంక ఘట్టమనేని తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు వాటిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మహేష్ బాబు ఆ ఫోటోలలో చాలా సింపుల్గా, స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం చేయకపోయినా ఆయనలో కనిపించే ఆ అందం, గ్రేస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుకే చాలా మంది మహిళా అభిమానులు ఇప్పటికీ ఆయనను తమ ఫేవరెట్ హీరోగా భావిస్తుంటారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు అభిమానులు ఈ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. “మహేష్ బాబు ఎప్పుడూ ఇలానే స్టైలిష్గా కనిపిస్తారు” అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్ట్పై పని చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు “వారణాసి”. ఈ చిత్రం ఒక మైథో ఫాంటసీ కథతో తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరియు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక చివరిగా మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో కనిపించారు. ఈ సినిమా మహేష్ బాబుకి పెద్దగా విజయం అందించలేకపోయింది. ఈ క్రమంలో వారణాసి తో మాత్రం మహేష్ బాబు ఫ్యాన్ ఇండియా మార్కెట్ సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Mahesh Babu Varanasi: మహేష్ బాబు డ్యాన్స్ పై కొరియోగ్రాఫర్ కామెంట్స్ ..ఇదేం ట్విస్ట్ సామీ..!