E-Paper
Advertisement

Mohan Babu: 50 ఏళ్ల సినీ ప్రస్థానం..మోహన్ బాబుకు అరుదైన గౌరవం..

Mohan Babu: 50 ఏళ్ల సినీ ప్రస్థానం..మోహన్ బాబుకు అరుదైన గౌరవం..
Advertisement

Mohan Babu: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)ఒకరు. విలన్ పాత్రలతో మొదలైన ఈయన ప్రస్థానం హీరోగా నిర్మాతగా మారి ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను అందించడమే కాకుండా ఎన్నో పురస్కారాలను గౌరవాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇటీవల 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో 50 సంవత్సరాల సినీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇలా మోహన్ బాబు 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడంతో ఈయన మరో గౌరవాన్ని అందుకోబోతున్నారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ..

2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పద్మ అవార్డులలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలో ఈ పురస్కారాన్ని సొంతం చేసుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు సైతం 2026 రిపబ్లిక్ డే పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోబోతున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసమానమైన కృషికి, 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాన్ని మోహన్ బాబుకు అందజేయబోతున్నారు. ఇలా మోహన్ బాబుకి ఈ విధమైనటువంటి అవార్డు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

570 కి పైగా సినిమాలు..

Advertisement

మోహన్ బాబు ఇలాంటి అవార్డుకు ఎంపిక కావడంతో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు అభిమానులు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. మోహన్ బాబు తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో సుమారు 570 కు పైగా సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. ఐదు దశాబ్దల సినీ ప్రయాణంలో నిర్మాతగా మారి కలెక్షన్ కింగ్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇక ఈయన చిత్ర పరిశ్రమలో ఇప్పటికి ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

పద్మశ్రీ పురస్కారం అందుకున్న మోహన్ బాబు..

Advertisement

మోహన్ బాబుకు గతంలో ఎంజీఆర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు మోహన్ బాబు అందించిన సేవలకు గాను 2007వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి గౌరవ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, మోహన్ బాబు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే .ఈయన ఎంపీగా కూడా గతంలో బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న మోహన్ బాబు సినిమాలతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇక ఇటీవల కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Padma Awards 2026: సినీ దిగ్గజాలకు.. పద్మ అవార్డులు, ఎవరెవరికి ఏయే పురస్కారాలు దక్కాయంటే?

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×