E-Paper
Advertisement

Padma Awards 2026: సినీ దిగ్గజాలకు.. పద్మ అవార్డులు, ఎవరెవరికి ఏయే పురస్కారాలు దక్కాయంటే?

Padma Awards 2026: సినీ దిగ్గజాలకు.. పద్మ అవార్డులు, ఎవరెవరికి ఏయే పురస్కారాలు దక్కాయంటే?
Advertisement

Padma Awards 2026: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ ప్రముఖులను వివిధ రకాల అవార్డులతో ప్రతి ఏడాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సత్కరిస్తున్న సంగతి తెలిసిందే ఇలా కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలలో పద్మ అవార్డులు ఎంతో కీలకంగా ఉంటాయి. ఈ పద్మ అవార్డులను ప్రతి ఏడాది ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మాత్రమే కాకుండా వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన వారికి పద్మ అవార్డులను అందిస్తారు. ఇక 2026 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ జాబితాలో పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ అవార్డులను అందుకోవటం గమనార్హం. ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరెవరు ఈ పద్మ అవార్డులను అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే..

పద్మ అవార్డు గ్రహీతలు..

*డాక్టర్ రాజేంద్రప్రసాద్ (పద్మశ్రీ)

Advertisement

*మురళీమోహన్ (పద్మశ్రీ)

*కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌ (పద్మశ్రీ)

Advertisement

*దివంగత నటుడు ధర్మేంద్రకు (పద్మ విభూషణ్)

* నటుడు మమ్ముట్టికి (పద్మవిభూషణ్)

* గాయ‌ని అల్కా యాజ్ఞిక్‌ (ప‌ద్మ భూష‌ణ్ )

131 మందికి పద్మ అవార్డు..

సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ సెలబ్రిటీలు పద్మ అవార్డులను అందుకోబోతున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది మొత్తంగా 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా 13 మందికి పద్మభూషణ్,5 మందికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 131 మందినీ పద్మ అవార్డులు వరించాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ఇతర రంగాలకు సంబంధించి మొత్తం 11 మంది ఎంపిక కావడం విశేషం.

కళామతల్లి సేవలో నటులు…

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, మురళి, మోహన్ ఈ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. మురళీమోహన్ గత కొన్ని దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ కళామతల్లికి ఎన్నో సేవలు చేశారు. ఇలా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఈయనకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు వరించింది . ఇక ఈయనతో పాటు రాజేంద్రప్రసాద్ కు కూడా పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మమ్ముట్టి, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా ఈ అవార్డులు రావడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పద్మ అవార్డులో అందుకున్న సెలబ్రిటీలకు అభిమానులు ఇతర సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.

Also Read: Akira Nandan: అకీరా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా? డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×