E-Paper
Advertisement

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!
Advertisement

Mohna Lal: ప్రముఖ మలయాళ స్టార్ హీరో మోహన్ లా(Mohan Lal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో ఒక్క మాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాష ఇండస్ట్రీలలో కూడా నటిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా హీరోగా నటించడమే కాకుండా ఇటు తండ్రి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పైగా ఈయన అద్భుతమైన నటనను, సినీ పరిశ్రమకు చేసిన సేవను గుర్తించి “దాదాసాహెబ్ ఫాల్కే” అవార్డుతో సత్కరించారు కూడా.. అలాంటి ఈయన గత 15 ఏళ్లుగా ఒక కేసులో తలమునుకలవుతున్న విషయం తెలిసిందే.

15 ఏళ్లుగా హైకోర్టులో పోరాడుతున్న మోహన్ లాల్..

అయితే ఈ విషయంపై హైకోర్టులో విచారణ మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం అధికారికంగా డిక్లేర్ చేసిన పత్రాలు.. కేరళ హైకోర్టు ముందు ఉంచగా.. ఈ విషయం ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం?.. 2011 జూన్ నెలలో సినీ నటుడు మోహన్ లాల్ ఇల్లు కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఏకంగా 4 ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండడం చట్టరీత్యా నేరం కావడంతో కేరళ అటవీ శాఖ మోహన్ లాల్ పై కేసు నమోదు చేసింది.

Advertisement

ALSO READ:నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సినిమా.. కానీ 2 రోజులకే తొలగింపు?

లీగల్ ఓనర్షిప్ సర్టిఫికెట్ సరైన సమయంలోనే వచ్చిందా?

ఇకపోతే దాదాపు గత 15 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి.కానీ ఇప్పుడు తాజాగా ఈ కేసులో భాగంగా మోహన్ లాల్ తరఫున సమర్పించిన నివేదికల ప్రకారం.. “మోహన్ లాల్ అటవీ శాఖ చట్టాలను ఉల్లంఘించలేదని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్నెస్టీ పథకం కింద ఆస్తులను ముందే డిక్లేర్ చేశారని” ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే మోహన్ లాల్ తన వద్ద ఉంచుకున్న 10 ఏనుగు దంతాలు , 13 దంతపు విగ్రహాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు వెల్లడించినప్పటికీ.. అటవీ శాఖ నుంచి వీటికి సంబంధించిన లీగల్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ సరైన సమయంలో పొందారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతోంది.

ఉత్కంఠ రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ..

Advertisement

మరి హైకోర్టులో జరుగుతున్న ఈ విచారణ ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేపథ్యంలో మోహన్ లాల్ కు న్యాయం జరుగుతుందా? లేదా ?అసలు తప్పు ఎక్కడ జరిగింది? సరైన సమయంలో ఓనర్ షిప్ సర్టిఫికెట్ పొందారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరి మోహన్ లాల్ ఈ కేసు నుంచి బయటపడతారా? లేదా? అని అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం

Related News

AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!

Producer : సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!

ఏమంటివి.. ఏమంటివి..అన్నగారి డైలాగుతో అదరగొట్టేసిన భాగ్యశ్రీ!

” సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి”.. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

అనిల్ నీ మాస్టర్ ప్లాన్ ఏంటయ్యా?

Big Stories

Advertisement
×