E-Paper
Advertisement

Kalki part 2: సైలెంట్ గా కల్కి 2 షూటింగ్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్..హైదరాబాద్ చేరుకున్న అశ్వత్థామ!

Kalki part 2: సైలెంట్ గా కల్కి 2 షూటింగ్ మొదలుపెట్టిన నాగ్ అశ్విన్..హైదరాబాద్ చేరుకున్న అశ్వత్థామ!
Advertisement

Kalki part 2: ప్రభాస్ హీరోగా నాగ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో పురాణ కథల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ సినిమాని కూడా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర బృందం మాత్రం ఈ విషయంపై ఎక్కడ అధికారకంగా స్పందించలేదు.

సాయి పల్లవి లుక్ టెస్ట్ పూర్తి

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కల్కి సినిమా షూటింగ్ పనులను దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రారంభించినట్టు సమాచారం. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడానికి కంటే ముందుగా సినిమాలోని నటినటులకు బ్రీఫింగ్ ఇస్తున్నట్టు సమాచారం ఇప్పటికే సుమతి పాత్రలో సాయి పల్లవి లుక్ టెస్ట్ కూడా పూర్తి అయ్యిందని తెలుస్తుంది. మొదట ప్రభాస్ లేని సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్టు సమాచారం.. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్స్ లో ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తుంది.

కల్కి 2 నుంచి తప్పుకున్న దీపిక పదుకొనే…

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ సైతం హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు మొదలయ్యాయనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక మొదటి భాగంలో సుమతి పాత్రలో దీపికా పదుకొనే నటించిన విషయం తెలిసిందే. ఇక రెండో భాగంలో కూడా ఈమె కొనసాగుతుందని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈమెను ఈ సినిమా నుంచి తప్పించారు. ఇలా దీపికా పదుకొనే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాలో తదుపరి హీరోయిన్ ఎవరు అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.

సుమతి పాత్రలో సాయి పల్లవి..

Advertisement

సుమతి పాత్ర కోసం అనుష్క, అలియా భట్, సాయి పల్లవి వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి కానీ సాయి పల్లవి సుమతి పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారిక ప్రకటన తెలియజేయబోతున్నారు. ఇక సుమతి పాత్రలో సాయి పల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించారని కల్కి టీం ఓ సందర్భంలో తెలియచేశారు. ఇక త్వరలోనే సాయి పల్లవి పాత్రకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోందని సమాచారం.

మొదటిసారి ప్రభాస్ జోడిగా సాయి పల్లవి?

ఇప్పటివరకు సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలతో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటివరకు టైర్ వన్ హీరోలతో నటించిన సందర్భాలు రాలేదు. మొదటిసారి ఈమె టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో నటించబోతున్నారనే విషయం తెలిసిన సాయి పల్లవి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి కూడా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Also Read: Mrithyunjay: శ్రీ విష్ణు మృత్యుంజయ విడుదల తేదీ ఫిక్స్…ఆ హీరో సినిమాకు పోటీగా..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×