E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!
Advertisement

Aadarsha kutumbam Release: ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఆ సినిమా సరిగ్గా అదే తేదీ విడుదల అవడం చాలా కష్టతరంగా మారిపోయింది. సినిమా విడుదల తేదీలను ప్రకటించిన తర్వాత తరచూ వాయిదాలు పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ ప్రకటించిన తర్వాత వెంకటేష్ (Venkatesh)నటిస్తున్న ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbham) సినిమా విడుదల విషయంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల కాబోతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

ఆదర్శ కుటుంబం విడుదల తేదీ పై క్లారిటీ..

ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారికంగా తెలియజేసినప్పటికీ ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో బహుశా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఆదర్శ కుటుంబం సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతలు ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ(Nagavamshi) ఆదర్శ కుటుంబం సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

అక్టోబర్ 2వ తేదీనే వస్తున్న ఆదర్శ కుటుంబం..

Advertisement

ఈ నేపథ్యంలోనే నాగ వంశీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీరు ప్రతిరోజు ఆదర్శ కుటుంబం సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ విషయాలను మేము వింటున్న కానీ మీకు చెప్పడం ఆలస్యమవుతుంది అందుకు క్షమించండి. నెల మొత్తం ఆదర్శ కుటుంబం సినిమా నుంచి వరుస సర్ప్రైజ్ లు ఉండబోతాయని, నెక్స్ట్ వీక్ ఈ సినిమా నుంచి టీజర్ ఉంటుందని తెలిపారు. అలాగే రెండో వారంలో ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. థర్డ్ వీక్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తామని నాగ వంశీ ఆదర్శ కుటుంబం సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఒకేసారి తెలిపారు.

Advertisement

ఈ సినిమాని ముందుగా అనుకున్న విధంగానే అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగానే విడుదల చేయబోతున్నట్లు నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని యధావిధిగా అక్టోబర్ రెండో తేదీ ఆదర్శ కుటుంబం రాబోతోంది అంటూ నాగ వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ఏకే 47 సినిమా అక్టోబర్ రెండో తేదీనే రాబోతుందనే విషయం తెలియడంతో వెంకటేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ,శ్రీనిధి హీరో హీరోయిన్లు తెరుకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్..18 ఏళ్ల కెరీర్ పై నాని ఎమోషనల్ పోస్ట్!

Related News

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

కొత్త ఉద్యోగంలో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియోతో ఊహించని సర్ప్రైజ్!

క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్..18 ఏళ్ల కెరీర్ పై నాని ఎమోషనల్ పోస్ట్!

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

Big Stories

Advertisement
×