Hayden On Pakistan Team : ఇంగ్లాండ్ గడ్డపై ( England) పాకిస్తాన్ ( Pakistan Team) అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్.. టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ ను కొని తెచ్చుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్నపలంగా ఏకంగా ఏడుగురు క్రికెటర్లను ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి రప్పించింది. ఇద్దరు కోచ్ లను కూడా అవమానించి మరి ఇంటికి పంపించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ టెస్ట్ పరిస్థితి ఎమర్జెన్సీ తలపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, మాజీ కోచ్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden ) ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ లో అద్భుతమైన టాలెంట్ ఉంది.. కానీ అందులో అందరూ కట్టప్పలే అని బాంబు పేల్చాడు. కట్టప్పలు ఉండడం వల్ల.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎదగడం లేదని విమర్శలు చేశారు మాథ్యూ హేడెన్. ఒక ఆటగాడు ఎదుగుతుంటే మరో ఆటగాడు.. కిందికి లాగడం ఎన్నో రోజుల నుంచి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. తాను ఆ జట్టుకు కోచ్ గా ఉన్నప్పుడు కూడా ఇవే పరిస్థితిలో ఉన్నాయని వెల్లడించారు. అందుకే పాకిస్తాన్ వరుసగా ఓడిపోతూ వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాథ్యూ హేడెన్.
అందరు క్రికెటర్లు కలిసి, మెలిసి సమిష్టిగా ఆడితే మంచి విజయాలు రావడం గ్యారంటీ అన్నారు మాథ్యూ హేడెన్. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ అఫ్రిది, సల్మాన్ అలీ అఘా లాంటి ఎంతో మంది తోపులు ఉన్నారని.. వాళ్లు అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్నారని వెల్లడించారు. కానీ ఈ క్రికెటర్ల మధ్య తరచూ గొడవలు జరగడం… ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల జట్టు చాలా దారుణంగా తయారవుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్ జట్టులో గ్రూప్ వార్ ఉండటం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, మాజీ కోచ్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden ).
పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం ఎక్కువైందని మాథ్యూ హేడెన్ (Matthew Hayden ) వెల్లడించారు. మొహ్సిన్ నఖ్వీకి చైర్మన్ పదవి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న ప్లేయర్ల రాక తక్కువైందని షాకింగ్ ఆరోపణలు చేశారు. వారసత్వ ఆటగాళ్లకు ఛాన్సులు ఎక్కువగా ఇవ్వడం.. డబ్బులు ఇచ్చి మరి కొంత మంది పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రావడం జరిగిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. దీని వల్ల కూడా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారయిందని వ్యాఖ్యానించారు.