E-Paper
Advertisement

Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!

Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!
Advertisement

Yellamma:జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి (Venu yeldandi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైన సమయంలో కమెడియన్ గా తన సత్తా చాటిన ఈయన.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. కాలక్రమేనా సినిమాలలో అవకాశాలు లభించడంతో జబర్దస్త్ కి దూరమయ్యారు. అక్కడే సినిమాలలో కమెడియన్ గా, నటుడిగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన వేణు తొలిసారి ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారి సంచలనం సృష్టించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అలా చిన్న తారాగణంతో తెలంగాణలోని గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు పలు విభాగాలలో అవార్డులు కూడా లభించాయి.

హీరోగా మారిన దేవి శ్రీ ప్రసాద్..

అలా ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన వేణు.. ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఎల్లమ్మ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి కారణం సరైన హీరో దొరకకపోవడమే. ముందుగా ఈ సినిమా కోసం చాలామంది హీరోలను వేణు అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఫైనల్ కాలేకపోయారు. ఇక చివరికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్గా సంచలనం సృష్టించి స్టార్ హోదాను దక్కించుకున్న దేవిశ్రీప్రసాద్, నటుడిగా తన ముఖానికి రంగు పులుముకోబోతున్నాడు అని తెలిసి అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

దేవి ను ఢీ కొట్టడానికి సిద్ధమైన ఒకప్పటి హీరో..

Advertisement

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.పైగా సినిమా టైటిల్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది కూడా.. పైగా హీరో ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలంగాణ కల్చర్ లో భాగమైన ఎల్లమ్మ తల్లి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ పార్శీ అనే పాత్రలో కనిపిస్తాడని ముందే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో కీలక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక హీరోని తెరపై చూపించడానికి అటు విలన్ రోల్ కూడా అంతే ఈక్వల్ గా ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే హీరోకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో విలన్ పాత్రకి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వనున్నారట వేణు. అందుకుగాను ఒక సీనియర్ స్టార్ హీరోని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు వడ్డే నవీన్.

ALSO READ:Allu Arjun 22: నెగిటివ్ రోల్ లో శ్రీవల్లి.. నిజమైతే ఆ రికార్డ్ గ్యారెంటీ!

రీ ఎంట్రీలో బలమైన పాత్ర..

Advertisement

ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వడ్డే నవీన్.. ఇప్పుడు రీ ఎంట్రీలో భాగంగా ఒక బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించారట. అందుకు తగ్గట్టుగానే వేణు కూడా ఈ కథ గురించి చెప్పడంతో చాలా ఎక్సైట్ అయిన వడ్డే నవీన్ కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×