E-Paper
Advertisement

వరుణ్ తేజ్ కి ప్రమాదం..స్పందించిన నిహారిక..సర్జరీ సక్సెస్ అంటూ

వరుణ్ తేజ్ కి ప్రమాదం..స్పందించిన నిహారిక..సర్జరీ సక్సెస్ అంటూ
Advertisement

Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఈమె ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించగా ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక మూడో సినిమా తన అన్నయ్య వరుణ్ తేజ్ (Varun Tej)తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బరి (Bhari)అనే టైటిల్ తో ఈ సినిమా వాలీబాల్(Volley Ball) నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు అయితే ఈ సినిమా షూటింగ్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ మోకాలికి ఫ్రాక్చర్..

ఇలా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈయన ప్రమాదానికి గురి అయ్యారని ఈ ప్రమాదం కారణంగా తన మోకాలికి చిన్న ఫ్రాక్చర్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై నిహారిక(Niharika) అధికారకంగా స్పందించారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ అధికారక సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ విషయం పట్ల స్పందిస్తూ.. అన్నయ్య వరుణ్ తేజ్ బరి సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోకాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని తెలిపారు.

వరుణ్ తేజ్ సర్జరీ సక్సెస్..

Advertisement

ఇక ప్రస్తుతం ఈయనకు సర్జరీ జరిగిందని సర్జరీ కూడా సక్సెస్ ఫుల్ అయిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలు వరుణ్ తేజ్ ఉన్నారని తెలిపారు. త్వరలోనే తన అన్నయ్య ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఈమె ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే తన అన్నయ్యకు ప్రమాదం జరిగిందనే విషయం తెలిసినటువంటి అభిమానులు చూపించిన ప్రేమ వారికి మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ఈమె ధన్యవాదాలు తెలియజేశారు. వరుణ్ తేజ్ కు జరిగిన ప్రమాదం గురించి నిహారిక అధికారికంగా తెలియజేయడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు వరుణ్ తేజ్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు తన చెల్లెలు నిహారిక నిర్మాణంలో కమిటీ కుర్రాళ్ళు సినిమా దర్శకుడు యదు వంశీ దర్శకుడిగా బరి అనే సినిమాని ప్రకటించి ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఇలా ప్రమాదానికి గురి కావడంతో కొద్దిరోజులు ఆలస్యంగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఉండబోతుందని, అదే విధంగా ఈ సినిమాని 2027 సంక్రాంతి బరిలో రాబోతుందని నిహారిక తెలియజేశారు.

Also Read: షూటింగ్ మొదలవ్వకుండానే ఓటీటీ డీల్ క్లోజ్.. అనిల్ రావిపూడి అన్ స్టాపబుల్ క్రేజ్!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×