Kalki 2 Title: పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కల్కి సీక్వెల్ సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ (Nag Aswin)అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ టైటిల్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాలి. మరి కల్కి సీక్వెల్ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు? ఇందులో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయానికి వస్తే?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కొట్టకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వల్ గా రాబోతున్న ఈ చిత్రానికి ‘కర్ణ 3102 బీసీ’ (Karna 3102 BC)అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. కల్కి సీక్వెల్ సినిమా మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూ కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి కర్ణ 3102 బీసీ అని టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రభాస్(Prabhas) కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నట్టు పార్ట్ వన్ లోనే చూపించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 ప్రభాస్ కర్ణ పాత్ర హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. కర్ణుడిగా ప్రభాస్ పాత్ర గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని ప్రభాస్ కర్ణుడి పాత్రలో విశ్వరూపం చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా కల్కి 2 టైటిల్ గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి.
దీపికా స్థానంలో సాయి పల్లవి..
ఇక ప్రభాస్ త్వరలోనే కల్కి 2 సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీకానున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరొక నెల రోజులలో షూటింగ్ పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాలో కూడా బిజీ కానున్నారు. త్వరలోనే ఫౌజీ షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ కల్కి 2 షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. ఇక పార్ట్ వన్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా సీక్వెల్ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో సాయి పల్లవి నటించబోతునట్టు తెలుస్తోంది.
Also Read: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి రాబోతున్న నిహారిక రాకాస ..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?