The RajaSaab: పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిర్మాతలు ఆసించిన ఫలితాలు ఇవ్వలేక పోయింది. అయినా ప్రభాస్ సినిమాల్లో డీసెంట్ మూవీ అనే చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్ వర్షన్ కాకుండా.. ఎక్స్ టెండెట్ కట్ ను ఓటీటీలో విడుదల చేయనున్నారు నిర్మాతలు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబారాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మొదటి ఈ సినిమాలో దాదాపు అయిదు నిమిషాలు ఉన్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్ తీసేశారు. ఎంతో ఆసక్తిగా ఉన్న ఆ తీసేసినందుకు ప్రక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆ సీన్లు యాడ్ చేశారు. అప్పటికే మిక్సుడ్ టాక్ రావడంతో ఆ సీన్లు యాడ్ చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా ఓటీటీలోకి ఎక్స్ టెండెడ్ కట్ రాబోతుంది. ఇది ఎలా ఉండబోతుందో చూడాలిమరి.
Read also-Soundarya Rajinikanth: కూలీ సినిమాపై రజనీకాంత్ కూతురు కామెంట్.. ఏంటీ దారుణం?
యాక్షన్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రయోగం చేసిన ‘ది రాజాసాబ్’ ఆశించినంత మేర ఆకట్టుకోలేక పోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నా ముఖ్యంగా దర్శకత్వంలో స్టార్ ఇమెజ్ తగ్గ సీన్లు పడలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే మొదటి విడుదల చేసిన థియేట్రికల్ వర్షన్ లో ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్ కట్ చేసేశారు. ఇప్పుడు వాటిని యాడ్ చేసి ఓటీటీలో విడుదల చేయనున్నారు. దీంతో సినిమా రన్ టైమ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు గంటలకు పైగా ఉన్న ఈ సినిమా ఓటీటీలో కి వచ్చేసరిగా మరెన్ని నిమిషాలు కలుస్తాయో వేచి చూడాలి మరి. ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి రానుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Madhavan Interview: హీరో మాధవన్ను ఇంటి నుంచి గెంటేసిన భార్య సరిత.. ఏం చేశారంటే?
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సాంకేతికంగా చాలా ఉన్నతంగా రూపొందింది. ఈ సినిమా హారర్-కామెడీ జోనర్లో గ్రాండ్ విజువల్స్ అందించడం కోసం అత్యాధునికమైన VFX (విజువల్ ఎఫెక్ట్స్) మరియు భారీ సెట్టింగులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తమన్ అందిస్తున్న సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ విజువల్స్కు రిచ్ లుక్ ఇస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భ్యానర్ పై విడుదలైన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు.
Due to unforeseen circumstances and last-minute technical glitches, we’ve added the extended cut! ⚠️
Regret the inconvenience caused due to hype 🙂
India's Biggest Superstar on JioHotstar | 6th Feb 👑#TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #ExtendedCut #JioHotstar pic.twitter.com/3Kq7ofY8qT
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 5, 2026