Globe Trotter Event: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికే దక్కిందని చెప్పాలి. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీకి ఆమడ దూరంలో ఉన్న ఆస్కార్ అవార్డు కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి మొదటి ఆస్కార్ అవార్డు అందించిన ఘనత రాజమౌళికి ఉందని చెప్పాలి. క్రమశిక్షణ, నియమ నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన రాజమౌళి నుంచి ఎన్నో విషయాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది అలాంటి రాజమౌళి మహేష్ బాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) కార్యక్రమంలో భాగంగా రాజమౌళి, మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కూడా మహేష్ బాబు నుంచి ఒక గొప్ప అలవాటును నేర్చుకోవాలని ఆయనకున్న మంచి అలవాటు గురించి తెలిపారు. మహేష్ బాబు సోషల్ మీడియాలో సినిమాలకు సంబంధించిన పోస్టులు వేస్తుంటారు అయితే ఆ పోస్టులు చూస్తే ఈయన నిత్యం సెల్ ఫోన్ లోనే గడుపుతారని అందరూ భావిస్తారు కానీ అది నిజం కాదని తెలిపారు.. మహేష్ బాబు ఒకసారి షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టిన తర్వాత తన మొబైల్ ఫోన్ తన కారులోనే ఉంటుంది . షూటింగ్ పూర్తి అయ్యేవరకు మహేష్ బాబు ఫోన్ ముట్టుకోరని అది 6 గంటలైనా పది గంటలైనా సరే ఫోన్ తీసుకోరు అంటూ మహేష్ బాబులో ఉన్న గొప్ప అలవాటు గురించి రాజమౌళి వెల్లడించారు.
రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు మహేష్ బాబు లో ఉన్న ఈ అలవాట్లను నేర్చుకోవాలని చెప్పడంతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ ఎంతో సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక మహేష్ బాబు మొదటిసారి రాజమౌళితో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా SSMB 29 అనే టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంది. తాజాగా ఈ కార్యక్రమానికి వారణాసి (Varanasi)అనే టైటిల్ పెట్టినట్లు చిత్ర బృందం వెల్లడించారు.
రుద్రగా మహేష్ బాబు..
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ తో పాటు మహేష్ రుద్ర (Rudra)అనే పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాని 2027 వేసవి సెలవులలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా కీరవాణి తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కుంభ పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read: Globe Trotter Event: మహేష్ రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసిన కీరవాణి!