E-Paper

రణవీర్ సింగ్ ‘ధురంధర్’ స్క్రిప్ట్ PMO నుంచే వచ్చిందా?.. రాకేశ్ బేడీ ఏమన్నారంటే!

రణవీర్ సింగ్ ‘ధురంధర్’ స్క్రిప్ట్ PMO నుంచే వచ్చిందా?.. రాకేశ్ బేడీ ఏమన్నారంటే!
Advertisement

Dhurandhar PMO Rumours: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘ధురంధర్’ (Dhurandhar). బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ అసలు రైటర్లు రాసింది కాదని.. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచే వచ్చిందని కొందరు రూమర్స్ క్రియేట్ చేశారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ‘అమృత్ రత్న 2026’ సదస్సులో పాల్గొన్న సీనియర్ నటుడు రాకేశ్ బేడీ ఈ రూమర్లపై స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Read also-టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్.. గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ!

PMO లో ఆ డైలాగ్ ఎవరు రాస్తారు?

Advertisement

ఈ సినిమాలో తీవ్రమైన హింస, ఉత్కంఠభరితమైన యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ, రాకేశ్ బేడీ మార్క్ కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా సినిమాలో బాతులు ఉండే ఒక సీన్‌లో ఆయన చెప్పిన బోల్డ్ హ్యూమరస్ డైలాగ్ నెట్టింట తెగ వైరల్ అయింది.

ఆ రూమర్ల గురించి రాకేశ్ బేడీ మాట్లాడుతూ.. “సినిమా భారీ హిట్ అయ్యాక కొందరు ఈ సినిమా స్క్రిప్ట్ PMO నుండి వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. కానీ నేను చెప్పిన ఆ కామెడీ లైన్‌ను ఉద్దేశించి.. ఇలాంటి బోల్డ్ డైలాగులు PMOలో కూర్చుని ఎవరైనా రాయగలరా? అసలు అక్కడ అలా ఎవరైనా ఆలోచిస్తారా? అని నేనే రివర్స్‌లో ప్రశ్నించాను” అంటూ ఆ రూమర్లను నవ్వుతూ కొట్టిపారేశారు.

సీరియస్ సినిమాలో కామెడీ.. నా ఐడియానే!

Advertisement

మొదట్లో దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాలో కామెడీ పెట్టడానికి అస్సలు ఇష్టపడలేదని రాకేశ్ బేడీ వెల్లడించారు.

డైరెక్టర్ వెనకడుగు: “నేను స్క్రిప్ట్ రెండు, మూడు సార్లు చదివినప్పుడు సినిమా చాలా ఇంటెన్స్‌గా, సీరియస్‌గా అనిపించింది. అందుకే ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇవ్వడానికి అక్కడక్కడా కొద్దిగా హ్యూమర్ (కామెడీ) జోడిస్తే బాగుంటుందని ఆదిత్యకు సూచించాను. అయితే ఆదిత్య మొదట కాస్త సంకోచించారు. కానీ షూటింగ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆయన కూడా ఆ కామెడీని బాగా ఎంజాయ్ చేశారు” అని బేడీ పేర్కొన్నారు.

ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ముందే తెలుసు: ఈ ఫ్రాంచైజీలో రాకేశ్ బేడీ ‘జమీల్ జమాలి’ అనే ఒక పవర్‌ఫుల్ భారతీయ ఏజెంట్ పాత్రను పోషించారు. పాకిస్తాన్ రాజకీయాల్లోకి చొరబడి, అక్కడ లీడర్‌గా మారే ఈ క్యారెక్టర్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ (ఆయన ఇండియన్ ఏజెంట్ అనే విషయం) తనకు స్క్రిప్ట్ స్టేజ్ నుంచే తెలుసని ఆయన చెప్పారు.

బాక్సాఫీస్ రికార్డులు!

ఈ సినిమా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పరిపాలనను ఎక్కువగా కీర్తిస్తూ, గత ప్రభుత్వాల విజయాలను తక్కువ చేసి చూపించిందనే విమర్శలు కూడా కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది.

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అంతం చేయడానికి వెళ్లే జస్కిరత్ సింగ్ రంగి (అలియాస్ హంజా అలీ మజారీ) అనే ఏజెంట్ కథతో వచ్చిన ఈ రెండు భాగాలు భారీ వసూళ్లు సాధించాయి.

Read also-Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..

ధురంధర్ 1: ప్రపంచవ్యాప్తంగా ₹1,307 కోట్లు వసూలు చేసింది.

ధురంధర్ 2: ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ₹1,790 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం నటించిన ఈ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ.. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలోనూ దూసుకుపోతోంది.

Related News

శర్వానంద్, శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. ‘జార్జ్ క్రిష్’గా సంక్రాంతి బరిలోకి చార్మింగ్ స్టార్!

స్క్రీన్‌పై భయపెట్టిన ‘సమారా’ ఇక లేదు.. 35 ఏళ్లకే ‘ది రింగ్’ నటి డేవేగ్ చేజ్ హఠాన్మరణం!

టాలీవుడ్‌లో క్రేజీ మల్టీస్టారర్.. గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ!

నాని ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘ప్యారడైజ్ ‘ మళ్ళీ వాయిదా..?

మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

సూర్య రికార్డు బద్దలు.. 2026 వరల్డ్ వైడ్ టాప్ సౌత్ గ్రాసర్‌గా రామ్ చరణ్ ‘పెద్ది’!

సుకుమార్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

×