E-Paper
Advertisement

నిన్న ఇండస్ట్రీ బ్యాన్.. నేడు మైసూర్ టెంపుల్ విజిట్..రణ్‌వీర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హైడ్రామా!

నిన్న ఇండస్ట్రీ బ్యాన్.. నేడు మైసూర్ టెంపుల్ విజిట్..రణ్‌వీర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హైడ్రామా!
Advertisement

Ranveer Controversy:  ఒకవైపు మూడేళ్ళ నిషేధం, మరో వైపు కోర్టుల మొట్టికాయలు..వెరసి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కుంటున్నట్టే కనిపిస్తుంది.విషయంలోకి వెళ్తే నిన్నటికి నిన్న ఫర్హాన్ అక్తర్‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుండి రణ్‌వీర్ సింగ్ బయటికి రావడంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ ఆయనపై మూడేళ్ళ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే.ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా మంగళవారం ఉదయాన్నే ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి మైసూరులోని చాముండేశ్వరి దేవిని దర్శించుకోవడం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపొయింది .

పంజుర్లి దైవాన్ని అసభ్యకర రీతిలో అనుకరణ 

Advertisement

ఈ వివాదానికి బీజం గత ఏడాది నవంబర్ 30, 2025న గోవాలో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో పడింది. కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన రిషబ్ శెట్టి సంచలన చిత్రం ‘కాంతార’లోని అత్యంత పవిత్రమైన పంజుర్లి దైవం హావభావాలను, దైవ నర్తనలను రణ్‌వీర్ సింగ్ వేదికపై వెక్కిరిస్తూ, అసభ్యకర రీతిలో అనుకరించారనే ఆరోపణలు వచ్చాయి.

also read :మళ్లీ ‘బాలయ్య వర్సెస్ నాగ్’.. 2027 సంక్రాంతి రేసులో మైండ్ బ్లోయింగ్ క్లాష్!

Advertisement

మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ 

అంతటితో ఆగకుండా చాముండి అమ్మవారిని భూతంగా పేర్కొన్నారంటూ కన్నడ ప్రజలు, సాంప్రదాయవాదులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రణ్‌వీర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరగడంతో, ఆయన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆ సినిమాలో రిషబ్ శెట్టి అద్భుతమైన నటనను ప్రశంసించడమే తన ఉద్దేశమని, దేశంలోని ప్రతి సంస్కృతిని తాను గౌరవిస్తానని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన వివరణ ఇచ్చారు కూడా. అయితే ఈ సోషల్ మీడియా క్షమాపణల్లో నిజాయతీ లేదంటూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో రణ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు

ఈ న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడేందుకు రణ్‌వీర్ సింగ్ 2026 ఏప్రిల్‌లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, సవరించిన అఫిడవిట్ ద్వారా న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నారు. ఆయన పశ్చాత్తాపాన్ని గమనించిన న్యాయస్థానం, నాలుగు వారాల గడువు విధిస్తూ మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన గడువు ముగిసే చివరి నిమిషంలో రణ్‌వీర్ ముంబై విమానాశ్రయం నుండి నేరుగా మైసూరు చేరుకుని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

also read :రణ్వీర్ సింగ్‌పై బాలీవుడ్ నిషేధం…రూ. 45 కోట్ల వివాదంలో ఊహించని షాక్!

ఏది ఏమైనా గతంలో ‘పద్మావత్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను ఏలిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం ఒకవైపు ఇండస్ట్రీ నుండి నిషేదం , మరోవైపు దైవ నింద ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి ఈ కాంట్రవర్సీల నుండి రణ్‌వీర్ ఎలా బయటపడతాడో !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×