Mahesh Babu: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ దర్శకుడు రాజమౌళి కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి చిన్న సమాచారం వచ్చినా కూడా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో పెద్ద చర్చగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కుల కోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ.160 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. ఈ ఆఫర్ భారతీయ భాషలలో విడుదలయ్యే ఓవర్సీస్ రైట్స్ కోసం అని తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై సినిమా టీమ్ ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ ఆఫర్పై నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం. ఒకవేళ ఈ డీల్ నిజమైతే, ఓవర్సీస్ హక్కుల రూపంలో రూ.160 కోట్లు పొందిన తొలి భారతీయ సినిమాగా ‘వారణాసి’ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
ఈ సినిమా కథ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెబుతున్నారు. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ద్వారా సినిమా స్థాయి ఏమిటో ప్రేక్షకులకు చూపించారు. ఇది ఒక ఫాంటసీ – మైథలాజికల్ కథతో రూపొందుతున్న భారీ సినిమా.
ఈ చిత్రంలో మహేష్ బాబు రాముడు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మందాకిని అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు పెద్ద ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Mahesh Babu :మహేష్ బాబు వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ ఇదే..!
‘వారణాసి’ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాల్లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే, అత్యధిక దేశాల్లో విడుదలైన భారతీయ సినిమాగా కూడా ‘వారణాసి’ కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.