E-Paper
Advertisement

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా
Advertisement

Rishab Shetty : రిషబ్ శెట్టి దర్శకత్వంలో కాంతారా చాప్టర్ 1 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమా భారీ సక్సెస్ సాధించింది కాబట్టి చాప్టర్ 1 సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ తర్వాత సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ ట్రెండ్ మొదలైంది. దీనికి కారణం రిషబ్ శెట్టి తెలుగు ఈవెంట్లో కేవలం కన్నడ మాట్లాడటమే. గతంలో రిషబ్ శెట్టి కొన్ని ఇంటర్వ్యూస్ లో తెలుగు కూడా మాట్లాడారు. కానీ ఆ ఈవెంట్ లో మాత్రం తెలుగు మాట్లాడలేదు. సోషల్ మీడియాలో దీని గురించి విపరీతంగా చర్చలు జరిగాయి. బహుశా అది చిత్ర యూనిట్ వరకు వెళ్లి ఉండవచ్చు. అందుకని ఇప్పుడు విజయవాడలో జరిగిన ఈవెంట్ లో కంప్లీట్ తెలుగులో మాట్లాడారు. వివాదానికి ముగింపు పలికారు అని ఇక్కడితో తేలిపోయింది.

అప్పుడే తెలుగులో మాట్లాడుతా..

Advertisement

రిషబ్ శెట్టి మాట్లాడుతూ… హ్యాపీ దసరా, ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇన్ని దీవెనలు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. కాంతారా విడుదలై ఇది మూడవ సంవత్సరం. 2022లో ఇదే రోజున కాంతారా రిలీజ్ అయింది. అక్టోబర్ రెండవ తారీఖున చాప్టర్ 1 వస్తుంది. అంతే ఆశీర్వాదం ఇవ్వాలి. సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్. నాకంత బాగా తెలుగు రాదు. కానీ నేను ట్రై చేస్తున్నాను.

నేను జై హనుమాన్ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ తో పనిచేస్తున్నాను. అప్పుడు నేను కరెక్ట్ గా తెలుగు నేర్చుకొని మాట్లాడుతాను.

Advertisement

స్పెషల్ గా మన సహోదరుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) , అలానే ట్రైలర్ రిలీజ్ చేసినందుకు ప్రభాస్ (Prabhas) . స్పెషల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (deputy CM Pawan Kalyan) గారికి థాంక్యూ సో మచ్. కన్నడ, కన్నడిగా తెలుగు మేమందరం సోదరులం అంటూ మాట్లాడారు.

వివాదానికి చెక్ 

మొత్తానికి రిషబ్ శెట్టి (Rishabh Shetty) తెలుగులో మాట్లాడలేదు అనే వివాదానికి ఈరోజుతో చెక్ పెట్టేసాడు. ఈ ఈవెంట్ లో కేవలం రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా, తన వైఫ్ కూడా తెలుగులో మాట్లాడటం ఆశ్చర్యం. మొత్తానికి తెలుగు యువత అనుకున్నది సాధించి మరి రిషబ్ శెట్టి తో విజయవాడ సభలో తెలుగు ను మాట్లాడించారు. ఈ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు. దీని గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరిగాయి. డబ్బింగ్ సినిమాకి హైక్స్ ఎందుకు అంటూ కొంతమంది పోస్టులు పెట్టారు. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కూడా రేపటి నుంచి మొదలుకానున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

Also Read : Naga Vamsi: ఆ సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×