E-Paper
Advertisement

Kurnool Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు స్పాట్‌లోనే మృతి

Kurnool Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు స్పాట్‌లోనే మృతి
Advertisement

Kurnool Crime: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పత్తికొండ పట్టణంలో ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన వారిని తుగ్గలి మండలం ముకెల గ్రామానికి చెందిన భూమిక (26), నితిక (5) తల్లీకూతుళ్లు, మరొకరు శిరీష(30)గా పోలీసులు గుర్తించారు. తల్లి కూతుళ్లు ఇద్దరు కలిసి శిరీషతో ఊరు వెళ్లేందుకు సమీపంలోని ఆటోస్టాండ్‌ వద్ద ఆటోలో వేచి చూస్తున్నారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అటు వైపుగా బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి వెనక నుంచి ఆటోను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు..

Advertisement

ALSO READ: Chennai Crime: ఘోర ప్రమాదం.. పవర్ ప్లాంట్‌లో శ్లాబ్ కూలి 9 మంది స్పాట్‌డెడ్

ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందినట్టు పోలీసులు వివరించారు. ప్రమాదానికి గురైన ఆటో నుజ్జునుజ్జయిందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: TVK Vijay: తొక్కిసలాటలో 41 మంది మృతి.. స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×