E-Paper
Advertisement

AP Woman Molested: తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం

AP Woman Molested: తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం
Advertisement

AP Woman Molested: ప్రజల్ని కాపాడాల్సిన రక్షక భటులే కామాంధులుగా మారారు. మహిళలకు అండగా ఉండాల్సిన పోలీసులే అత్యాచారానికి ఒడిగట్టారు. తమిళనాడులోని తిరువణ్ణామలై(అరుణాచలం) పుణ్య క్షేత్రానికి వెళ్తున్న ఏపీ యువతిపై పోలీస్ కానిస్టేబుళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యువతిని తిరువణ్ణామలైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులే యువతిపై అత్యాచారం చేశారని తెలిసి అంతా షాక్ అయ్యారు.

యువతిపై అత్యాచారం

Advertisement

ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ మహిళ తన 18 ఏళ్ల కూతురితో కలిసి అరుణాచలం ఆలయానికి వెళ్తున్నారు. వీరిద్దరూ మార్గమధ్యలో టమాటాల రవాణా చేస్తున్న వాహనంలో ఎక్కారు. ఆ గూడ్స్ వాహనంలో తల్లీకూతురు, డ్రైవర్ ముగ్గురే ఉన్నారు. ఈ వాహనం సోమవారం రాత్రికి ఎంథాల్ బైపాస్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బైపాస్‌పై పెట్రోలింగ్‌ చేస్తున్న సురేశ్ రాజ్, సుందర్ అనే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు టమాటాల వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయాలని చెప్పి తల్లీకూతురుని కిందకు దింపారు.

పోలీసులను చూసి భయపడిన గూడ్స్ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. తల్లీకూతురు తాము అరుణాచలం వెళ్తున్నామని, దారిలో ఈ వాహనం ఎక్కామని చెప్పారు. వారిద్దరినీ తమ వాహనం మీద అరుణాచలం తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు విల్లుపురం రోడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ యువతి తల్లిని ముళ్లపొదల్లోకి తోసేశారు.

కానిస్టేబుల్స్ అరెస్ట్

Advertisement

యువతిని విల్లుపురం సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. యువతి తల్లి స్థానికంగా ఉన్న వారికి జరిగిన విషయం చెప్పడంతో వాళ్లు 108కు ఫోన్ చేశారు. గ్రామస్థులు యువతిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: School Student Tied: ఏడేళ్ల బాలుడిపై ప్రిన్సిపల్ అమానుషం.. తలకిందులుగా కిటికీకి కట్టి డ్రైవర్ తో కొట్టించిన వైనం

పోలీసులే యువతిపై అత్యాచారానికి పాల్పడడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. రక్షించాల్సిన వాళ్లే ఇలా దారుణానికి పాల్పడితే ఎవరిని నమ్మాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×