Betting App Case: బెట్టింగ్ యాప్ వ్యవహరంలో పలువురు సినీ, టీవీ నటీనటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ తో పాటు టీవీ యాక్టర్స్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ ఇలా మొత్తం 29మందిపై ఈ ఏడాది మేలో బెట్టింగ్ యాప్ కేసు నమోదైంది. అయితే పోలీసు విచారణ అనంతరం ఈ కేసు సీఐడీకి వెళ్లింది. దీంతో కొన్ని రోజులు ఈ కేసులోని నటీనటులు వరుసగా నోటీసులు ఇస్తూ విచారణ ఆదేశిస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, యాంకర్ విష్ణు ప్రియ వంటి పలువురు సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ బాస్ ఫేం రీతూ చౌదరి, సోషల్ మీడియా ఇన్ప్లైయేన్స్ భయ్యా సన్నీ యాదవ్లు కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఆదేశం మేరకు మంగళవారం (డిసెంబర్ 23) రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ విచారణకు హాజరయ్యారు. రెండు గంటలకు సీఐడీ వారిని విచారించినట్టు సమాచారం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు ఎవరెవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారని దానిపై ఆరా తీశారు. వారి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీసిసిన్టటు సమాచారం. అదేవిధంగా వారి బ్యాంక్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన కాపీలను సీఐడీకి రీతూ, సన్నీయాదవ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో వారు బెట్టింగ్ యాప్స్ చేసినట్టు సీఐడీ ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సీఐడీ ఇప్పటి వరకు మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసి వారిని విచారించింది. ఈ కేసుమలో వారందరి స్టేట్మెంట్ని కూడా సీఐడీ రికార్డు చేసుకుంది.
Also Read: Actor Tylor Chase: ఒకప్పుడు స్టార్ నటుడు.. ఇప్పుడు వీధుల్లో అడుక్కు తింటున్నాడు
పలు ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేయడంతో పాటు, 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు విచారించింది. రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ విచారణతో ఈ కేసు విచారణ పూర్తయ్యింది. ఇక బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ తుది రిపోర్టును తయరు చేయనుంది. సెలబ్రిటీలు ఇచ్చిన వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. ఈ విచారణలో ఒక్కో సెలబ్రిటీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా ఎంత సంపాదించారని వివరాలు కూడా రాబ్టటింది. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లను సైతం సీఐడీ పరిశీలించినట్టు సమాచారం.