BigTV English
Advertisement

Bollywood Ramayan : రాముడి పాత్రలో రణబీర్… సద్గురు రియాక్షన్ ఇదే

Bollywood Ramayan : రాముడి పాత్రలో రణబీర్… సద్గురు రియాక్షన్ ఇదే

Bollywood Ramayan: భారతీయ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే. రామాయణం గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ రామాయణం గురించి సరికొత్త సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి (Nitesh Tiwari)దర్శకత్వంలో రామాయణ (Ramayana) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)ప్రధాన పాత్రలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


రణబీర్ రాముడి పాత్ర పై సద్గురు కామెంట్స్..

ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. బీఫ్ తినే వ్యక్తి రాముడిగా నటించడమా? అంటూ రణబీర్ కపూర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఈ పాత్ర కోసం రణబీర్ కపూర్ ను ఎంపిక చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా చిత్ర బృందం వెల్లడించారు. తాజాగా రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం గురించి వచ్చిన విమర్శలపై సద్గురు(Sadhguru) స్పందించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా సద్గురు అందరికీ ఎంతో సుపరిచితమే.

రాముడి పాత్రలో నటిస్తారని తెలియదు కదా?

తాజాగా సద్గురు నటుడు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం గురించి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో రణబీర్ కపూర్ నటించిన పాత్రలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన రాముడి పాత్రలో నటించకూడదని చెప్పటం సరికాదు. భవిష్యత్తులో తాను రాముడి పాత్రలో నటిస్తాననే విషయం ఆయనకు తెలిసి ఉండదు. ఈరోజు రాముడి పాత్రలో నటించిన రణబీర్ కపూర్ రేపు రావణాసురుడి పాత్రలో కూడా నటించవచ్చు కదా.. ఇలా గత పాత్రలను దృష్టిలో పెట్టుకొని రాముడి పాత్ర చేయకూడదు అనడం సరైంది కాదు అంటూ స్వయంగా సద్గురు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.


రావణాసురుడు పాత్రలో యష్..

ఇటీవల రామాయణ సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రతో జరిగిన సంభాషణలో భాగంగా ఈ విషయం ప్రస్తావనకు రావడంతో సద్గురు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అదేవిధంగా రావణాసురుడి పాత్రలో నటిస్తున్న యష్(Yash) గురించి కూడా సద్గురు స్పందించారు. రావణాసురుడి పాత్రలో నటించడానికి యష్ పూర్తిగా అర్హుడని తెలిపారు. ఇక ఈ సినిమాలో యశ్ రావణాసురుడిగా విలన్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఇక సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఏకంగా 4 వేల కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడితో రామ్ పోతినేని.. రంగంలోకి బడా ప్రొడ్యూసర్?

Related News

Baahubali The Epic :వెయిట్ చేయక్కర్లేదు, బాహుబలి చేంజెస్ కాకుండా ఇవి ఆడ్ చేశారు

Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Mahesh Babu: బాహుబలి పనులలో రాజమౌళి.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్!

The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదా.. ఆమె రిజెక్ట్ చేస్తేనే ?

Lokesh Kanagaraj: లోకేష్ కి హీరోయిన్ దొరికేసిందోచ్.. రచ్చ రాంబోలే!

Big Stories

×