E-Paper
Advertisement

SaiPallavi: వెనక్కి తగ్గిన సాయి పల్లవి.. ఎఫెక్ట్ రామాయణం పై పడదుగా?

SaiPallavi: వెనక్కి తగ్గిన సాయి పల్లవి.. ఎఫెక్ట్ రామాయణం పై పడదుగా?
Advertisement

SaiPallavi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సాయి పల్లవి (Sai Pallavi) లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా అభిమానుల చేత దక్కించుకుంది. అద్భుతమైన నటనతో.. డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఉర్రూతలూగించే ఈమె.. తన అందంతో అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన మొదటి చిత్రంగా మేరే రహో అనే చిత్రంలో నటించింది.

మేరే రహో సినిమా విడుదల నిలిపివేత..

మరొకవైపు సుమారుగా 4 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇదే ఆమె తొలి డెబ్యూ అనుకున్నారు. కానీ దానికంటే ముందే ఈమె అమీర్ ఖాన్ నిర్మించిన మేరే రహో అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. పైగా ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్లో విడుదల చేయాల్సి ఉండగా.. విడుదల ఆగిపోయింది. దీనికి కారణం బడా చిత్రాలే అనే చెప్పాలి. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్లో రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ రికార్డు సృష్టించింది.

అసలు కారణం ఏంటంటే?

Advertisement

ఈ చిత్రంతోపాటు హాలీవుడ్ అవతార్ ఫ్రాంచైజీ అవతార్ 3 తో పాటూ అనన్య పాండే, కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లో వచ్చిన రొమాంటిక్ ప్యూర్ లవ్ డ్రామా మూవీ తూ మేరీ మైన్ తేరా మైన్ తేరా తూ మేరీ చిత్రాలు విడుదలయ్యాయి. ఇలాంటి చిత్రాల మధ్య తమ సినిమాను విడుదల చేస్తే అసలు ఆదరించరేమో అనే కారణంతోనే అమీర్ ఖాన్ నిర్మించిన మేరే రహో చిత్రం వాయిదా పడింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకున్నారు కానీ ఈ చిత్రాల కారణంగానే ఈ సినిమాను ఈ ఏడాది జూన్ కి వాయిదా వేశారు.

ఈ సినిమా ఫలితం రామాయణం పై పడుతుందా?

ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఫలితం రామాయణం మీద పడుతుందేమో అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ..మేరే రహో సినిమా విజయం సాధించింది అంటే సాయి పల్లవికి హిందీలో మార్కెట్ పెరుగుతుంది.. ఒకవేళ డిజాస్టర్ గా నిలిస్తే మాత్రం ఈ సినిమా ఫలితం రామాయణం పై పడుతుందని కొంతమంది ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ కోసమే వెనక్కి తగ్గిన సాయి పల్లవి మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

also read:VK Naresh – Pavitra: పుకార్లకు చెక్.. అలా క్లారిటీ ఇచ్చిన నరేష్ – పవిత్ర జంట!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×