Sandeep Raj : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సందీప్ రాజ్ ఒకరు. చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు సందీప్. ఆ తర్వాత కలర్ ఫోటో అనే సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. ఆ సినిమా థియేటర్లో విడుదల కాలేదు కానీ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ సాధించుకుంది. అన్నిటిని మించి ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడం అనేది ప్రత్యేకం.
2020లో వచ్చిన ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ రాజ్ కెరియర్లో దర్శకుడుగా ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు మోగ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సందీప్. అయితే ఈ సినిమా డిసెంబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్లో సందీప్ రాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు.
కలర్ ఫోటో లాంటి సూపర్ హిట్ సినిమా చేస్తేనే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాను. అటువంటిది ఒక ప్లాప్ సినిమా చేస్తే నా కెరియర్ ఏమైపోతుందో నాకు తెలుసు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మోగ్లీ అనే సినిమాను చేశాను. ఈ సినిమా ఖచ్చితంగా డిసెంబర్ 13న థియేటర్లో చూడండి అదిరిపోతుంది అంటూ మాట్లాడాడు.
అలానే అఖండ సినిమాని కూడా చూడండి. మనం ఒక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న తర్వాత బయట పాన్ డబ్బా దగ్గర ఒక కిల్లి తింటాం. ఈ సినిమా అలాంటిదే, కిళ్ళి కొట్టులో దొరికే మీనాక్షి పాన్ లాంటిది ఈ సినిమా అంటూ మొగ్లీ సినిమాను పోల్చాడు సందీప్.
ఈ కథను మొదట దర్శకుడు మారుతీకి చెప్పాడట సందీప్ రాజ్. అయితే మారుతి మాట్లాడుతూ సందీప్ చాలా మంచి టాలెంటెడ్ ఎస్ కే ఎన్ అన్న ద్వారా నాకు పరిచయం ఎస్ కే ఎన్ బిస్కెట్ లో పనిచేస్తాడు బాగా టాలెంటెడ్ అని అప్పట్లో నాతో ఎస్ కే ఎన్ అని చెప్పాడు.
మంచి టాలెంటెడ్ కానీ తమ్ముడు ఎందుకు ఈ మధ్యకాలంలో ట్విట్టర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అఖండ సినిమా రావడం అనేది ఈ సినిమాకి ఇంకా పెద్ద ప్లస్ అయింది. ఎందుకంటే ఈ సినిమా కూడా ఒకటి ఉంది అని చాలా ఎక్కువమందికి రీచ్ అయింది అంటూ మారుతి చెప్పాడు. ట్విట్టర్ లో ఏమి పడితే అవి పెట్టొద్దు అంటూ జాగ్రత్తలు చెప్పాడు మారుతి.
Also Read : Maruthi : ప్రగతి గారు మిమ్మల్ని బూతులు తిడుతున్నారు కానీ మీరు పట్టించుకోకండి