Sarath Kumar: ఈ మధ్య ఒక ఈవెంట్లో శరత్ కుమార్ మాజీ భార్య అలానే శరత్ కుమార్ ప్రస్తుత భార్య ఒకే వేదికపై కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోలో శరత్ కుమార్ మొదటి భార్య ఛాయా, ప్రస్తుత భార్య రాధిక శరత్ కుమార్..అలాగే కూతురు వరలక్ష్మీ ఒకే వేదికపై కనిపించారు.
శరత్ కుమార్ మొదట ఛాయాను వివాహం చేసుకున్నారు. వారికి వరలక్ష్మీ అనే కూతురు ఉంది. తరువాత కొన్నేళ్లకు శరత్ కుమార్, నటి రాధికను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఛాయా, శరత్ కుమార్ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వరలక్ష్మీ తన తల్లితో పాటు రాధికతో కూడా మంచి సంబంధాన్ని కొనసాగిస్తోంది.
ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో ఈ ముగ్గురు మహిళలు ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేకంగా మారింది. కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ సమయంలో ఛాయాకు మాట్లాడే అవకాశం వచ్చింది.
?igsh=OGw2djN0dWs1aTgz
ఈ ఈవెంట్లో మాట్లాడిన ఛాయా, రాధికను గౌరవంగా ఉద్దేశించి మాట్లాడారు. “రాధిక మామ్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. అది నాకు చాలా ఆనందం ఇచ్చింది” అని అన్నారు. తరువాత, “ఒక్కసారి నిలబడి కూర్చోండి” అని చిరునవ్వుతో కోరారు. రాధిక కూడా నవ్వుతూ ఆమె మాట వినడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది.
అంతేకాకుండా, రాధిక కుటుంబంతో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చాలా బాగుందని ఛాయా చెప్పారు. ఇటీవల వచ్చిన ఒక సినిమాలో రాధిక నటనను కూడా ప్రశంసించారు. ఈ మాటలు విన్న వరలక్ష్మీ పక్కనే నిలబడి చిరునవ్వుతో కనిపించింది.
ALSO READ: Virosh:స్వామివారి ఆశీస్సులు తీసుకున్న కొత్త దంపతులు.. హైదరాబాద్ గుడిలో విరోష్ జంట..!