E-Paper
Advertisement

Shilpa Shetty: సొంత రెస్టారెంట్ మూసివేయడంపై స్పందించిన శిల్పా శెట్టి.. ఏమన్నారంటే?

Shilpa Shetty: సొంత రెస్టారెంట్ మూసివేయడంపై స్పందించిన శిల్పా శెట్టి.. ఏమన్నారంటే?
Advertisement

Shilpa Shetty: బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న శిల్పా శెట్టి (Shilpa Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ప్రముఖ వ్యాపారవేత రాజ్ కుంద్రా (Raj Kundra)ను వివాహం చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రూ.60 కోట్ల స్కామ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ఇప్పుడు తాజాగా తన సొంత రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు సెప్టెంబర్ 3న సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నిజానికి ఈమె స్థాపించిన ఈ బాస్టియన్ రెస్టారెంట్ ముంబైలోని ఫేమస్ రెస్టారెంట్లలో ఒకటిగా నిలిచింది. అలాంటి రెస్టారెంట్ ను ఈమె మూసివేస్తున్నామని ప్రకటించడంతో నెటిజన్స్, అభిమానులు కారణాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపించారు.

రెస్టారెంట్ మూసివేయడం పై శిల్పా శెట్టి క్లారిటీ..

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా మరో వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చింది శిల్పా శెట్టి. ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్ అయిన బాస్టియన్ ను శిల్పా శెట్టి ప్రారంభించారు. మొదటి బ్రాంచ్ తోనే క్లోజ్ చేస్తున్నట్లు చెప్పడంతోనే అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ.. “బాస్టియన్ రెస్టారెంట్ ను మూసి వేస్తున్నామని ప్రకటించిన తర్వాత సుమారుగా 4 వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్ ని పూర్తిగా మూసివేయడం లేదు. ఎందుకంటే బాంద్రాలోని బాస్టియన్ రెస్టారెంట్ మాకు పునాది లాంటిది. ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో ఇప్పుడు బాస్టియన్ కూడా మాకు ఒక కొత్త ఫలాన్ని అందించబోతోంది. ఇదే ప్రదేశంలో మేము “అమ్మకై” (AMMKAI )పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలను రుచి చూపించబోతున్నాము. ముఖ్యంగా నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.

Advertisement

అక్టోబర్లో ప్రారంభం..

అయితే మీకు ఇష్టమైన ఈ బాస్టియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. కానీ, బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో మేము దీనిని ప్రారంభించబోతున్నాము. కాబట్టి బాస్టియన్ క్లోజ్ చేసాం అనే ప్రచారంలో నిజం లేదు. నా, సోదరుడు, వ్యాపార భాగస్వామి రంజీత్ బింద్ర వీటికి సీఈఓ గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచన నుంచి వచ్చినవే . బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్ నెలలోనే ప్రారంభం అవుతాయి” అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే శిల్పా శెట్టి సొంత రెస్టారెంట్ బాస్టియన్ మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇప్పుడు మళ్లీ అందులో నిజం లేనని ఆమె క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరొకవైపు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అసలేం జరిగిందంటే?

అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. సెప్టెంబర్ 3న తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన బాస్టియన్ రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు శిల్పా శెట్టి అధికారికంగా ప్రకటించింది. ఈ గురువారం ముంబైలోని అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటైన బాస్టియన్ బాంద్రాకు వీడ్కోలు పలుకుతూ ఒక శకానికి ముగింపు పలుకుతున్నాము. ఈ రెస్టారెంట్ తో మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, మరుపురాని రాత్రులు ఉన్నాయి . చివరి రోజున ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వాముల కోసం ఒక ప్రత్యేకమైన సాయంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో కొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాము ” అంటూ తెలిపింది..

ALSO READ:Bigg Boss 9 Promo : బిగ్ బాస్ నుంచి బిగ్ సర్ప్రైజ్… మరో మూడు రోజుల్లోనే

?utm_source=ig_web_copy_link

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×