E-Paper
Advertisement

Rain Alert: ముంచుకొస్తున్న ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తోంది

Rain Alert: ముంచుకొస్తున్న ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తోంది
Advertisement

Rain Alert: ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన.. ఇదే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితి.. ఉదయం ఎండ దంచికొడుతుంది. దీంతో ప్రజలందరు వారి పనులకు వెళ్తున్నారు. కానీ మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోని వర్షం దంచికొడుతుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీకి అల్పపీడనం ముప్పు..
ఏపీలో మరో 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం (UAC) ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతూ క్రమంగా బలపడుతోంది. దీని కారణంగా రాబోయే 24 గంటల్లో దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి, ఆ తర్వాత బుధవారం నుండి మొత్తం తీర ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విజయవాడ, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, గుంటూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Advertisement

Also Read: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

తెలంగాణలో మళ్లీ వర్షాలు..
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. నేడు మళ్లీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 23 నుంచి 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి – భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ములుగు, వరంగల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లకూడాదని సూచిస్తున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×