Siddhu Jonalgadda: టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు రాంబో అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది స్వరూప్ ఆర్ఎస్జే కాగా, ప్రముఖ నిర్మాత సితార నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది.
రాంబో సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో సిద్ధు ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించి, ఆ తర్వాత డిటెక్టివ్ లేదా ఏజెంట్గా మారే పాత్రలో నటించనున్నాడు. ఇప్పటివరకు సిద్ధు చేసిన పాత్రలకంటే ఇది పూర్తిగా భిన్నమైన పాత్ర కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథ, స్క్రీన్ప్లే రెండింటికీ దర్శకుడు స్వరూప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం.
ఇటీవల సిద్ధు నటించిన ‘జాక్’, ‘తెలుసు కదా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో కొంత గ్యాప్ తీసుకుని, బలమైన కథతో తిరిగి రావాలని సిద్ధు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా ప్రకటించిన ‘కోహినూర్’, ‘బడాస్’ సినిమాలను పక్కన పెట్టి, ‘రాంబో’నే తన కంబ్యాక్ సినిమాగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తన కెరీర్ను మళ్లీ ట్రాక్లో పెట్టేస్తుందనే నమ్మకం సిద్ధులో కనిపిస్తోంది.
దర్శకుడు స్వరూప్ విషయానికి వస్తే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చేసిన మిషన్ ఇంపాజిబుల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తర్వాత ‘వైబ్’ అనే సినిమా మొదలుపెట్టినా, అది వివిధ కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు ‘రాంబో’తో మరోసారి తన ప్రతిభను నిరూపించుకోవాలని స్వరూప్ భావిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సిద్ధుకు అదృష్టంగా మారిందని చెప్పాలి. ఇదే బ్యానర్లో వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందుకే ‘రాంబో’ సినిమాపై హీరో, దర్శకుడు, నిర్మాత ముగ్గురికీ మంచి నమ్మకం ఉంది. ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డ కెరీర్కు మళ్లీ బలమైన మలుపు తిప్పుతుందా అనే విషయం చూడాలి.
ALSO READ: Yash Toxic సినిమా కథ లీక్.. ఈ కాలంలో ఇది వర్కౌట్ అవుతుందా?