E-Paper
Advertisement

ప్లీజ్ నన్ను తప్పు పట్టొద్దు.. శాపంగా మారుతుందనుకోలేదు కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ!

ప్లీజ్ నన్ను తప్పు పట్టొద్దు.. శాపంగా మారుతుందనుకోలేదు కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ!
Advertisement

Singer Mangli: సింగర్ మంగ్లీ ఇటీవల కాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె 10 కోట్లు రూపాయలు మోసపూరితంగా తీసుకుంది అంటూ అడ్వకేట్ సుబ్బారావు(Advocate Subbarao) తనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై సింగర్ మంగ్లీ(Singer Mangli) ఇప్పటికే స్పందిస్తూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. అయితే తాజాగా మరోసారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఈమె మీడియా సమక్షంలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. మంగ్లీ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ అడ్వకేట్ సుబ్బారావు ఏదైతే తన గురించి ఆరోపణలు చేశారో అది ఏమాత్రం నిజం కాదని తెలిపారు.

సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్..

అడ్వకేట్ సుబ్బారావుకు సినిమాలు అంటే ఎంతో పిచ్చి. ఆయనకు బిగ్ బాస్ వెళ్లాలని ఉంది. ఆయనకు శ్రీముఖి అంటే క్రష్ బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఫేమస్ కావాలి అందుకోసమే ఎన్నో మీడియా ఛానల్ ను సంప్రదించి ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించారు అది కుదరని నేపథ్యంలో తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలకు పాల్పడ్డారని మంగ్లీ తెలిపారు. సుబ్బారావు చేసిన ఆరోపణలలో నిజం ఉందని తేలితే నేను ఏం చేయడానికైనా సిద్ధమే ఇందుకోసం తాను ఏ పోలీస్ స్టేషన్ కైనా వస్తాను ఏ కోర్టు మెట్లైనా ఎక్కుతాను అంటూ ఈమె మాట్లాడారు.

నాకు రెండు చేతుల నిండా పని ఉంది..

Advertisement

ఎవరైతే నా పేరును ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడ్డారో వారికి పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నాను అలాగే బాధితులకు తాను పూర్తిగా అండగా ఉంటానని తెలిపారు. నేను కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇక్కడికి వచ్చాను అలాంటిది తాను ఎందుకు ఇతరులను మోసం చేస్తాను. నాకు ప్రస్తుతం రెండు చేతుల నిండా పని ఉంది ప్రజల ఆశీర్వాదం ఉంది ఇలాంటి తప్పుడు పని తాను చేయనని తెలిపారు. కేవలం సుబ్బారావు నా నుంచి డబ్బులు లాగడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.

Advertisement

అడ్వకేట్ సుబ్బారావు గత కొద్దిరోజులుగా డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నారు అయితే తాను కొన్ని ఈవెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని అందుకే ఇప్పుడు తన పై కేసు నమోదు చేస్తున్నానని తెలిపారు. ఇక తాను ఏ రాజకీయాలలోకి వెళ్లట్లేదని ఏ రాజకీయ జెండాలు మోయడం లేదని, నాకు పాటే ప్రాణమని తెలిపారు. నా గురించి సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి దయచేసి నిజా నిజాలు తెలుసుకొని వార్తలు వేయండి. నా జీవితంలో సోషల్ మీడియా నాకు ఇలా శాపంగా మారుతుందని అసలు అనుకోలేదు. నిజా నిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పు పట్టొద్దు అంటూ ఈ సందర్భంగా మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read: ఫ్యాన్స్ దెబ్బకు పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్.. మూతపడిన స్టాండప్ కామెడీ సెంటర్స్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×