E-Paper
Advertisement

ప్లీజ్ నన్ను తప్పు పట్టొద్దు.. శాపంగా మారుతుందనుకోలేదు కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ!

ప్లీజ్ నన్ను తప్పు పట్టొద్దు.. శాపంగా మారుతుందనుకోలేదు కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ!
Advertisement

Singer Mangli: సింగర్ మంగ్లీ ఇటీవల కాలంలో వరుస వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె 10 కోట్లు రూపాయలు మోసపూరితంగా తీసుకుంది అంటూ అడ్వకేట్ సుబ్బారావు(Advocate Subbarao) తనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై సింగర్ మంగ్లీ(Singer Mangli) ఇప్పటికే స్పందిస్తూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. అయితే తాజాగా మరోసారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఈమె మీడియా సమక్షంలో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. మంగ్లీ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ అడ్వకేట్ సుబ్బారావు ఏదైతే తన గురించి ఆరోపణలు చేశారో అది ఏమాత్రం నిజం కాదని తెలిపారు.

సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్..

అడ్వకేట్ సుబ్బారావుకు సినిమాలు అంటే ఎంతో పిచ్చి. ఆయనకు బిగ్ బాస్ వెళ్లాలని ఉంది. ఆయనకు శ్రీముఖి అంటే క్రష్ బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఫేమస్ కావాలి అందుకోసమే ఎన్నో మీడియా ఛానల్ ను సంప్రదించి ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించారు అది కుదరని నేపథ్యంలో తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలకు పాల్పడ్డారని మంగ్లీ తెలిపారు. సుబ్బారావు చేసిన ఆరోపణలలో నిజం ఉందని తేలితే నేను ఏం చేయడానికైనా సిద్ధమే ఇందుకోసం తాను ఏ పోలీస్ స్టేషన్ కైనా వస్తాను ఏ కోర్టు మెట్లైనా ఎక్కుతాను అంటూ ఈమె మాట్లాడారు.

నాకు రెండు చేతుల నిండా పని ఉంది..

Advertisement

ఎవరైతే నా పేరును ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడ్డారో వారికి పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నాను అలాగే బాధితులకు తాను పూర్తిగా అండగా ఉంటానని తెలిపారు. నేను కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇక్కడికి వచ్చాను అలాంటిది తాను ఎందుకు ఇతరులను మోసం చేస్తాను. నాకు ప్రస్తుతం రెండు చేతుల నిండా పని ఉంది ప్రజల ఆశీర్వాదం ఉంది ఇలాంటి తప్పుడు పని తాను చేయనని తెలిపారు. కేవలం సుబ్బారావు నా నుంచి డబ్బులు లాగడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.

Advertisement

అడ్వకేట్ సుబ్బారావు గత కొద్దిరోజులుగా డబ్బు కోసం నన్ను బెదిరిస్తున్నారు అయితే తాను కొన్ని ఈవెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని అందుకే ఇప్పుడు తన పై కేసు నమోదు చేస్తున్నానని తెలిపారు. ఇక తాను ఏ రాజకీయాలలోకి వెళ్లట్లేదని ఏ రాజకీయ జెండాలు మోయడం లేదని, నాకు పాటే ప్రాణమని తెలిపారు. నా గురించి సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి దయచేసి నిజా నిజాలు తెలుసుకొని వార్తలు వేయండి. నా జీవితంలో సోషల్ మీడియా నాకు ఇలా శాపంగా మారుతుందని అసలు అనుకోలేదు. నిజా నిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పు పట్టొద్దు అంటూ ఈ సందర్భంగా మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read: ఫ్యాన్స్ దెబ్బకు పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్.. మూతపడిన స్టాండప్ కామెడీ సెంటర్స్!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×