Sri Reddy: శ్రీ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె గత కొంతకాలంగా సోషల్ మీడియాకు వివాదాలకు దూరంగా ఉన్నారు .కానీ ఇటీవల నటుడు శివాజీ అమ్మాయిల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యల పట్ల ఈమె స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలా శివాజీ వివాదం ద్వారా తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన శ్రీ రెడ్డి నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా అమ్మాయిలకు ఈమె ఒక సలహా ఇస్తూ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
మరి కొన్ని గంటలలో కొత్త సంవత్సరానికి (New Year)స్వాగతం పలకబోతున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి (Sri Reddy)చేసిన ఈ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకు శ్రీ రెడ్డి ఎలాంటి మొహమాటం లేకుండా చాలా బోల్డ్ గా అందరికీ అర్థమయ్యే భాషలో పోస్ట్ పెట్టడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి స్పందిస్తూ.. “పిలవగానే ఎగేసుకుంటూ హోటల్ రూమ్ కి వెళ్ళటం కాదు, దూరంగా ఉన్నప్పటికీ ప్రేమిస్తూ కామాన్ని కంట్రోల్ లో పెట్టుకున్న ఆడవాళ్లను మాత్రమే అబ్బాయిలు గౌరవిస్తారు. పడుకునే అమ్మాయిలను ఎప్పటికీ వాడుకుంటారు తప్ప, పెళ్లి మాత్రం చేసుకోడు. మోసపోయాక ఏడ్చేయడం కంటే ప్రేమలే ఉన్నప్పుడే కామాన్ని కంట్రోల్ చేసుకోండి.. ఎలాంటి పరిస్థితులలో కూడా ప్రేమలో కామాన్ని మిక్స్ చేయకండి అంటూ” బోల్డ్ పోస్ట్ చేశారు.
Also Read: Nani Sujeeth Film: నాని, సుజీత్ సినిమాలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు.. కన్ఫర్మ్ అయినట్టే?
శ్రీ రెడ్డి అమ్మాయిలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.. ఇక ఈ పోస్టులపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీ రెడ్డి పచ్చిగా మాట్లాడిన నిజాలు మాట్లాడింది అంటూ ఈమెకు మద్దతు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా శివాజీ విషయంలో కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీ రెడ్డి వెంటనే అమ్మాయిలకు హితబోధ చేస్తూ ఈ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
https://www.facebook.com/story.php?story_fbid=1409450013878569&id=100044407510231&rdid=jTxVdS2uQAug5FgZ#
ఇటీవల శివాజీ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కూడా ఈ వివాదం సర్దుమనగడం లేదు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల శ్రీరెడ్డి స్పందిస్తూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు. శివాజీ చెప్పిన విషయం మంచిదే అయినా సరైన విధంగా చెప్పలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కాస్త నోరు కూడా అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలా శ్రీరెడ్డి గత కొద్దిరోజులుగా వరుస పోస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈమె తిరిగి యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగిన ఈమె పలు వివాదాల కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయడంతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉండేవారు అలాగే రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ నిత్యం వార్తలలో నిలిచారు.
Also Read; Actress Nandini Death: నందిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. డైరీలో విస్తుపోయే నిజాలు!