Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న భారీ అడ్వెంచర్ ‘వారణాసి’ ప్రాజెక్ట్తో ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఏళ్ల నాటి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బాగా హల్చల్ చేస్తోంది. ఈ దివ్య కావ్యాన్ని ఎన్నడూ చూడని రీతిలో, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు రాజమౌళి ప్రత్యేక బృందంతో సన్నాహాలు ప్రారంభిస్తున్నారట. ఆ విశేషాలు మీకోసం..
జక్కన్న ప్రస్తుతం తన దృష్టంతా ‘వారణాసి’ చిత్రంపైనే ఉంచినప్పటికీ, ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) పర్యవేక్షణలో ఒక ప్రత్యేక రచయితల బృందం మహాభారతం స్క్రిప్ట్ పనులను ప్రారంభించినట్లు సమాచారం. ఈ కావ్యంలోని ప్రతి సన్నివేశాన్ని, పాత్రల అంతరంగాన్ని చాలా కొత్త కోణంలో, గ్లోబల్ ఆడియన్స్కు సైతం నచ్చే విధంగా సిద్ధం చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్ను కేవలం భారత్కే పరిమితం చేయకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించాలని రాజమౌళి భావిస్తున్నారు. ఇక అంతర్జాతీయ ప్రేక్షకులకు అర్థమయ్యే సరళమైన కథనం, కట్టిపడేసే ఎమోషన్స్, అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ గ్రాండీయర్గా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.
also read:అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!
ఈ విజువల్ వండర్లో నటించే తారల ఎంపికపై ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి దిగ్గజ నటులను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ఇక ఏ పాత్రకు ఏ స్టార్ సరిగ్గా సరిపోతారో ముందే లెక్కలేసి ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఎప్పుడు సెట్స్పైకి వెళ్తుందనే విషయంపై మేకర్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ వార్త సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే చిత్రాల్లో ఒకటిగా కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, వారణాసి చిత్రాలతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా జెండాను ఎగరేసిన రాజమౌళి, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దశాబ్దపు అతిపెద్ద విజువల్ వండర్గా రాబోతున్న ఈ సినిమా అధికారిక అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.