E-Paper
Advertisement

Telangana Gaddar Film Awards: జ్యూరీ కమిటీ ఛైర్మన్ మార్పు.. ఇప్పుడెవరంటే?

Telangana Gaddar Film Awards: జ్యూరీ కమిటీ ఛైర్మన్ మార్పు.. ఇప్పుడెవరంటే?
Advertisement

Telangana Gaddar Film Awards: కళాకారులకు ఇచ్చే పురస్కారాలైన నంది అవార్డ్స్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy) ప్రభుత్వం ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Telangana Gaddar Film Awards)ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ఈ సత్కార్యాన్ని మళ్లీ పున: ప్రారంభించి, ఆగిపోయిన సంవత్సరం నుంచి లెక్క పెట్టి అన్ని సంవత్సరాలకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అవార్డులను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అవార్డుల జ్యూరీ కమిటీలో అనూహ్య మార్పు సంభవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ను మార్చారు. ఇంతకు ముందు ఉన్న ఛైర్మన్‌ను మార్చి, ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన మరో దర్శకనిర్మాతకు ఆ హోదా కల్పించారు. వివరాల్లోకి వెళితే..

Also Read- Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి కోసం ఖర్చు ఎంతో తెలుసా? ఎంతైనా నేషనల్ క్రష్ కదా?

రాఘవేంద్రుని స్థానంలో తమ్మారెడ్డి..

Advertisement

తొలుత ఈ కమిటీ చైర్మన్‌గా సీనియర్ దర్శకులు కె. రాఘవేంద్రరావును ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయన స్థానంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy)ను చైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జీవో నెంబర్ 236ను జారీ చేసింది. మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియలేదు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ కేవలం సినిమా రంగం మాత్రమే కాకుండా, సామాజిక దృక్పథం ఉన్న చిత్రాలకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏర్పాటైంది. ప్రజా కవి గద్దర్ పేరు మీదుగా ఇస్తున్న ఈ అవార్డుల ప్రక్రియలో తమ్మారెడ్డి భరద్వాజ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read- The Kerala Story 2 Telugu Trailer: ది కేరళ స్టోరీ 2 తెలుగు ట్రైలర్ విడుదల.. మొదటి భాగం కన్నా సంచలనంగా..!

స్పెషల్ అవార్డుల కేటగిరీ పర్యవేక్షణ

Advertisement

2024 జనవరి 31న ప్రజా గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అవార్డుల పేరును అధికారికంగా ప్రకటించారు. దాదాపు 10 సంవత్సరాల అవార్డులను ఒకేసారి ప్రకటించి, అవార్డుల వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రస్తుతం 2024-25 సంవత్సరానికి‌గానూ విజేతల ఎంపిక జరుగుతోంది. ఈ ఏడాది మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఇప్పుడు నూతనంగా ఎంపికైన ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ.. టీమ్‌తో కలిసి స్పెషల్ అవార్డుల కేటగిరీలోని విజేతల ఎంపికను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది.

Also Read- VK Naresh: నాకు కావాల్సినట్టు నేను మాట్లాడుతా.. కావాలంటే ట్రోల్ చేసుకోండి!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×