Drugs Case: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఈ వ్యవహారంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. మరి కొంతమంది ఈడీ విచారణ ముందు కూడా హాజరైన విషయం తెలిసిందే. ఇంకొంతమందిపై అధికారులు వేటు కూడా వేశారు. ఇలా ఎన్నో జరుగుతున్నా.. డ్రగ్స్ మాఫియాని అరికట్టడం అసాధ్యంగానే మారిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి ఈ డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ , బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక పేరు మోసిన హీరోయిన్ సోదరుడు మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు.
అయితే ఇప్పుడు ఆమె సోదరుడు పరారీ అయినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం తో పాటు మాసబ్ ట్యాంకు పోలీసులు కూడా గాలిస్తున్నారు. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ ల అరెస్టుతో ఆ నటి సోదరుడి పేరు బయటకు వచ్చింది. ఇకపోతే పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
వీరి నుంచి 43 గ్రాముల కొకైన్ తోపాటు ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు ఈ నటి సోదరుడు పట్టుబడినట్టు సమాచారం. అయితే ఆ హీరోయిన్ పేరు, ఆమె సోదరుడి వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
ALSO READ:Anasuya: స్విమ్ సూట్లో అనసూయ.. మిస్ అవుతున్నా అంటూ వీడియో.. ఈ టైమ్లో అవసరమా?