E-Paper
Advertisement

Hero Dhanush: హీరో ధనుష్ కి లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!

Hero Dhanush: హీరో ధనుష్ కి లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!
Advertisement

Hero Dhanush:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు నటుడు గానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి ఇమేజ్ దక్కించుకున్న ఈయన ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఈయనకు లీగల్ నోటీసులు పంపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ధనుష్ కి లీగల్ నోటీసులు ఎవరు పంపించారు? అలా పంపించడం వెనుక అసలు కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

హీరో ధనుష్ కి లీగల్ నోటీసులు..

విషయంలోకి వెళ్తే.. తమిళ నిర్మాణ సంస్థ ‘తేనాండాళ్ ఫిలిమ్స్’ తో ధనుష్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. కమిట్మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల సినిమా ఆలస్యం అవుతోందని, ఇప్పటికే రూ.20 కోట్లు నష్టం వాటిల్లిందని ఫలితంగా రూ.20 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అని లీగల్ నోటీసులను నిర్మాణ సంస్థ ధనుష్ కి పంపింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది..

10 సంవత్సరాలైనా పట్టించుకోని ధనుష్..

Advertisement

పూర్తి వివరాలలోకి వెళితే ” 2016లో ఈ నిర్మాణ సంస్థపై ‘నాన్ రుద్రన్’ సినిమా చేయడానికి ధనుష్ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలని ధనుష్ భావించారు. కానీ ఆ తర్వాత దర్శకుడిగా తన నిర్ణయం విరమించుకోవడంతో వేరొక దర్శకుడిని సంప్రదించారు నిర్మాతలు. అయితే ధనుష్ వారికి పూర్తిగా స్క్రిప్ట్ ఇవ్వలేదని ఇప్పుడు నిర్మాణ సంస్థ ఆరోపణలు చేస్తోంది. దీని కారణంగానే షూటింగ్ ఆలస్యం అవుతుందని.. అందుకే 20 కోట్లు నష్టం వచ్చిందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ధనుష్ ఈ చిత్రాన్ని ప్రారంభించలేదని దీన్ని పక్కన పెట్టి ఇతర చిత్రాలను అంగీకరిస్తున్నారు అంటూ లీగల్ నోటీసులు పంపించింది. ఇక దీనిపై హీరో టీం ఇంకా స్పందించలేదు. మొత్తానికైతే సినిమా చేస్తానని ఒప్పుకున్న ధనుష్ 10 ఏళ్లు గడిచినా.. పట్టించుకోకపోవడం వల్లే.. సినిమా నిర్మాణం ఆలస్యం అవుతుందని భావించిన నిర్మాణ సంస్థ ధనుష్ కి లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ALSO READ:Shiva Jyothi: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి.. కానీ!

ధనుష్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. డీ55 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల తో పాటు ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే చివరిగా తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వల్ గా వచ్చిన కుబేర సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా.. నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కారా లో ధనుష్ నటిస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే దర్శకుడు వెట్రిమారన్ తో ఒక సినిమా చేస్తున్నారు.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×