E-Paper
Advertisement

టాలీవుడ్ టాప్ హీరోలను ఇలా చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవు భయ్యా..

టాలీవుడ్ టాప్ హీరోలను ఇలా చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవు భయ్యా..
Advertisement

Tollywood AI: తెలుగు సినిమా చరిత్రలో ‘వజ్రోత్సవాలు’ ఒక మైలురాయి. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే వేదికపై చేరి, కలిసి స్టెప్పులేసిన ఆ రోజులు టాలీవుడ్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మళ్లీ అలాంటి ఒక అద్భుతమైన కలయికను ఎప్పుడు చూస్తామా అని ప్రతి తెలుగు సినీ అభిమాని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఇప్పుడు అలాంటి ఒక అద్భుతం నిజంగా కాకపోయినా, టెక్నాలజీ పుణ్యమా అని సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లముందుకు వచ్చింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) ఫీవర్ ఊపేస్తోంది. ఈ తరుణంలో మన టాలీవుడ్ అగ్ర హీరోలందరూ కలిసి మన హైదరాబాద్ టీం ‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ (SRH) మ్యాచ్‌ను స్టేడియంలో కూర్చొని లైవ్‌గా చూస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి కదా! సరిగ్గా ఇదే ఊహకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రూపమిచ్చింది.

Advertisement

Read also-Gundeninda GudiGantalu Today episode: రోహిణికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..రోహిణి గుట్టు రట్టు..

ఒకే ఫ్రేమ్‌లో..

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక ఏఐ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అందరూ సన్‌రైజర్స్ జెర్సీలు వేసుకుని, స్టేడియంలో పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ లుక్‌లో కనిపిస్తే, మహేష్ బాబు ఎప్పటిలాగే క్లాస్ అండ్ హ్యాండ్‌సమ్ లుక్‌తో మెరిసిపోయారు. రెబల్ స్టార్ ప్రభాస్ తన కటౌట్‌కు తగ్గట్టుగా రాయల్‌గా కూర్చోగా, గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు పెడుతూ మ్యాచ్ చూస్తున్నట్లు డిజైన్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్వాగ్‌తో సన్‌రైజర్స్ టీంను చీర్ చేస్తూ కనిపించారు.

Advertisement

Read also-Podarillu Today Episode : గాయత్రిని చూసి మాధవ్ ఎమోషనల్.. చక్రిని ఇరికించిన మహా.. ఇదేం ట్విస్ట్ సామి..

రెండు కళ్లూ సరిపోవడం లేదు బాస్!

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం, నిమిషాల్లోనే వైరల్‌గా మారిపోయింది. వజ్రోత్సవం పాట తర్వాత మళ్లీ మన హీరోలందరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఇదేనంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. “ఇది కేవలం ఏఐ వీడియోనే కావచ్చు, కానీ ఈ దృశ్యాన్ని నిజంగా చూడటానికి మా రెండు కళ్లూ సరిపోవడం లేదు” అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజ జీవితంలో ఈ స్టార్స్ అందరూ బిజీ షెడ్యూల్స్ వల్ల ఒకే చోట కలవడం దాదాపు అసాధ్యంగా మారిన ఈ రోజుల్లో, ఏఐ టెక్నాలజీ సృష్టించిన ఈ విజువల్ వండర్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక తీపి జ్ఞాపకాన్ని, ఒక సరికొత్త అనుభూతిని అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×